C-Voter Survey: ఇప్పటికిప్పుడు ఎన్నికలొస్తే అధికారం ఏ పార్టీదంటే?

ప్రజెంట్ ఇండియాలో BJP హవా నడుస్తోంది. ఏ రాష్ట్రంలో ఎన్నికలు(Elections) వచ్చినా కమలం పార్టీ జెండా రెపరెపలాడుతోంది. ఇప్పటికే మోదీ(NAMO) హయాంలో ఆ పార్టీ ఎదురు లేకుండా దూసుకుపోతోంది. రికార్డు స్థాయిలో మూడో సారి గెలిచి వరుసగా మూడోసారి ప్రధాని(PM)గా నరేంద్రమోదీ బాధ్యతలు చేపట్టారు. ఇటీవల ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో నెగ్గి దాదాపు 27 ఏళ్ల తర్వాత ఢిల్లీ పీఠాన్ని కైవసం చేసుకుంది బీజేపీ. ఈ నేపథ్యంలో దేశంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే ఏ పార్టీ అధికారం చేజిక్కించుకుంటుందనే దానిపై ‘ఇండియా టుడే సీ ఓటర్ సర్వే(India Today C Voter survey)’ నిర్వహించింది. ఈ సర్వేలో షాకింగ్ ఫలితాలు(Results) వెలుగు చూశాయి.

బీజేపీకి ఒంటరిగానే 281 సీట్లు

దేశంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మరోసారి BJP నేతృత్వంలోని NDA అధికారంలో వస్తుందని తేలింది. కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే కావల్సిన మ్యాజిక్ ఫిగర్ 272 సీట్లు. ప్రస్తుతం NDAకు 284 స్థానాలే ఉన్నాయి. ఇస్ బార్ చార్ సౌ పార్ అంటూ బరిలో దిగిన BJP కేవలం 240 సీట్లకే పరిమితమైంది. కాంగ్రెస్ పార్టీ 232 సీట్లు గెల్చుకుంది. “ఇండియా టుడే సీ ఓటర్ మూడ్ ఆఫ్ ది నేషన్” పేరుతో ఒపీనియన్ పోల్ అంచనా వేసింది. ఇప్పుడు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ సారథ్యంలోని ఇండియా కూటమి 188 స్థానాలకు పడిపోనుంది. అటు BJP 281 సీట్లు సాధిస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా 78 స్థానాల్లో విజయం సాధిస్తుందని తేలింది.

2024 ఎన్నికల తర్వాత పుంజుకున్న బీజేపీ

కాగా దేశవ్యాప్తంగా అన్ని లోక్‌సభ నియోజకవర్గాల నుంచి 1,25,123 మంది ఓటర్ల అభిప్రాయాలు సేకరించారు. జనవరి 2వ తేదీ నుంచి ఫిబ్రవరి 9 వరకూ సేకరించిన అభిప్రాయాలివి. వాస్తవానికి 2024 ఎన్నికల్లో BJP అంతగా రాణించలేకపోయినా ఆ తరువాత వివిధ రాష్ట్రాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పుంజుకుంది. మహారాష్ట్ర, హరియాణా, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించింది. ఈ పరిణామాల్లో ఇప్పటికిప్పుడు దేశంలో ఎన్నికలు జరిగితే బీజేపీ మరోసారి అధికారం ఖాయమంటోంది ఈ సర్వే.

Related Posts

సొంతగడ్డపై సన్‘రైజర్స్’.. రాజస్థాన్‌పై 44 రన్స్‌ తేడాతో గ్రాండ్ విక్టరీ

ఐపీఎల్ రెండో మ్యాచ్‌లో సొంతగడ్డపై సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH) అదరగొట్టింది. ఉప్పల్ వేదికగా రాజస్థాన్ రాయల్స్‌(RR)తో జరిగిన మ్యాచులో 44 పరుగుల తేడాతో గ్రాండ్ విజయం సాధించింది. భారీ స్కోర్లు నమోదైన ఈ మ్యాచులో ఇరు జట్ల బ్యాటర్లు ఫోర్లు, సిక్సర్లతో చెలరేగి…

Sikindar: ‘సికిందర్’ ట్రైలర్ రిలీజ్.. వింటేజ్ లుక్‌లో సల్మాన్‌భాయ్

బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్(Salman Khan), ప్రముఖ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్(A.R. Murugadoss) కాంబోలో తెరకెక్కిన మూవీ ‘సికిందర్(Sikindar)’. ఈ మూవీలో సల్మాన్‌కు జోడీగా సక్సెస్‌ఫుల్ హీరోయిన్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న(Rashmika Mandanna) నటిస్తోంది. సత్యరాజ్, కాజల్ అగర్వాల్(Kajal Agarwal)…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *