ట్రంప్‌ టీమ్ లో ఎలాన్ మస్క్‌, వివేక్‌ రామస్వామి

Mana Enadu : అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఘన విజయం సాధించిన రిపబ్లికన్‌ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌ (Donald trump) తన ప్రభుత్వ ఏర్పాటుకు సన్నాహాలు ముమ్మరం చేశారు. ఈ క్రమంలోనే తన గెలుపులో కీలక పాత్ర పోషించిన ఇద్దరు ప్రముఖులకు కీలక బాధ్యతలు అప్పగించారు. వారిద్దరే.. స్పేస్ ఎక్స్ అధినేత, బిలియనీర్‌ ఎలాన్‌ మస్క్‌ (Elon musk), వివేక్‌ రామస్వామి (Vivek Ramaswamy). వీరికి ఎఫిషియెన్సీ శాఖ బాధ్యతలు అప్పగించారు డొనాల్డ్ ట్రంప్.

ఈ ఇద్దరు వ్యక్తులు ప్రభుత్వ అధికార యంత్రాంగం ప్రక్షాళన, మితిమీరిన నింబధనల కోత వంటి బాధ్యతలు నిర్వహిస్తారని డొనాల్డ్ ట్రంప్ ఓ ప్రకటన విడుదల చేశారు. అనవసర ఖర్చు తగ్గింపు, ఫెడరల్‌ ఏజెన్సీల పునర్నిర్మాణం వంటి బాధ్యతలు కూడా చూసుకుంటారని తెలిపారు. ‘సేవ్‌ అమెరికా-2 ఉద్యమానికి (Save America 2 Movement) ఇవి ఎంతో ముఖ్యమైనవన్న ట్రంప్.. వీరిద్దరూ తన పాలనకు మార్గం సుగమం చేస్తారనితన ప్రకటనలో పేర్కొన్నారు.

మరోవైపు, నేషనల్‌ ఇంటెలిజెన్స్‌ మాజీ డైరెక్టర్‌ జాన్‌ రాట్‌క్లిఫ్‌ను డొనాల్డ్ ట్రంప్.. సెంట్రల్‌ ఇంటెలిజెన్స్‌ ఏజెన్సీ (Central Intelligence Agency) డైరెక్టర్‌గా నియమించారు. అమెరికన్లందరి రాజ్యాంగ హక్కుల కోసం నిర్భయమైన పోరాట యోధుడిగా రాట్‌క్లిఫ్‌ నిలుస్తారని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇజ్రాయెల్‌ రాయబారి(Israel Ambassidor)గా అర్కాస్నాస్‌ మాజీ గవర్నర్‌ మైక్‌ హుక్‌అబీ.. రక్షణశాఖ కార్యదర్శి బాధ్యతలను ఫ్యాక్స్‌ న్యూస్‌లో హోస్ట్‌గా విధులు నిర్వహిస్తున్న పీట్‌ హెగ్సెత్‌కు అప్పగించారు.

అమెరికా జాతీయ భద్రత తదుపరి సలహాదారుగా ఫ్లోరిడా కాంగ్రెస్‌ సభ్యుడు, ఇండియా కాకాస్‌ సహాధ్యక్షుడు మైక్‌ వాల్ట్‌జ్‌ నియామకమయ్యారు.  వాల్ట్‌జ్‌ నియామకం భారత్‌-అమెరికా (Indo US Relations) సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందని ఇండియా కాకాస్‌ సహాధ్యక్షులు, డెమొక్రటిక్‌ సభ్యుడు రోఖన్నా అభిప్రాయపడ్డారు. వచ్చే ఏడాది జనవరి 20న అమెరికా 47వ అధ్యక్షుడిగా ట్రంప్ ప్రమాణస్వీకారం చేయనున్న సంగతి తెలిసిందే.

Related Posts

Alaska Meeting: ముగిసిన ట్రంప్-పుతిన్ భేటీ.. ఉక్రెయిన్‌తో వార్‌పై చర్చలు నిల్!

ప్రపంచం ఉత్కంఠగా ఎదురుచూసిన ఇద్దరు అగ్రనేతల భేటీ ముగిసింది. అలాస్కా(Alaska) వేదికగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ (Donald Trump), రష్యా అధ్యక్షుడు పుతిన్‌ (Vladimir Putin) సమావేశమయ్యారు. వీరిద్దరి మధ్య దాదాపు 2.30 గంటలకు పైనే చర్చలు జరిగాయి. అయితే…

ప్రభుత్వం బంపరాఫర్.. ప్రతి బిడ్డకు ఏడాదికి రూ.45 వేలు.. ఈ ఆఫర్ మిస్ కావద్దు

ప్రపంచంలో జనాభా వేల కోట్లకు చేరుతున్న తరుణంలో, కొన్ని దేశాలు మాత్రం జనాభా తగ్గిపోతుండటంతో తల్లిదండ్రులను ప్రోత్సహించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాయి. ముఖ్యంగా చైనా(China) దేశం ఒకప్పుడు అధిక జనాభాతో వెలవెలబోయిన ఈ దేశం ఇప్పుడు పిల్లల(Child) జననం తక్కువగా ఉండటంతో…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *