INS vs NZ: తొలిటెస్టులో నేడు కీలకం.. నిలుస్తారా? దాసోహం అవుతారా!

Mana Enadu: బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో భారత్, న్యూజిలాండ్(Ind vs Nz) జట్ల తొలి టెస్టులో నేడు కీలకంగా మారనుంది. తొలి ఇన్నింగ్స్‌లో 46 పరుగులకే కుప్పకూలి టీమ్ఇండియా(Team India) ప్రత్యర్థిని త్వరగా ఆలౌట్ చేయడంలో విఫలం అయింది. దీంతో న్యూజిలాండ్(New Zealand) 402 రన్స్ చేసింది. దీంతో ఆ జట్టుకు తొలి ఇన్నింగ్స్‌లో భారీ ఆధిక్యం సాధించింది. ఆ జట్టులో యువ ప్లేయర్ రచిన్ రవీంద్ర(134) తన టెస్ట్ కెరీర్‌లో రెండో సెంచరీ నమోదు చేయడం విశేషం. ఆ జట్టులో ఓపెనర్ డేవాన్ కాన్వె 191 పరుగులు చేయగా.. బౌలర్ టీమ్ సౌథీ(65) సైతం భారత బౌలర్లను దీటుగా ఎదుర్కొని హాఫ్ సెంచరీ బాదడం మూడో రోజు ఆటకే హైలైట్‌.

 ఆ ముగ్గురు ఏం చేస్తారో..

ఇక తొలి టెస్టు(1st Test)లో భారత్ జట్టు ఓటమి నుంచి తప్పించుకోవాలంటే రెండే దార్లు ఉన్నాయి. ఒకటి రెండో ఇన్నింగ్స్‌(Second Innings)లో కనీసం శనివారం మధ్యాహ్నం వరకు దూకుడుగా బ్యాటింగ్(Batting) చేసి 550 ప్లస్ స్కోరు చేయాలి లేదా ఈ రెండన్న రోజులు ఆలౌట్ కాకుండా వికెట్లు కాపాడుకోవాలి. కానీ తొలి ఇన్నింగ్స్‌లో 46 పరుగులకే ఆలౌటైన భారత్ జట్టు పూర్తి ఒత్తిడిలో ఉండటంతో.. రెండూ కష్టంగానే కనిపిస్తున్నాయి. కాగా ఇప్పటికీ భారత్ 125 పరుగులు వెనకబడి ఉంది. ఇప్పటికే జైస్వాల్ (35), రోహిత్(52), కోహ్లీ(70) పరుగులు చేసి ఔటయ్యారు. ఈ నేపథ్యంలో ముఖ్యంగా నేటి ఆటలో సర్ఫ్‌రాజ్(70*) పంత్, కేఎల్ కీలకంగా మారనున్నారు.

 తేలిపోయిన టీమ్ఇండియా బౌలర్లు

టీమ్ఇండియాను తొలి ఇన్నింగ్స్‌లో కివీస్(Kiwis) కేవలం 31.2 ఓవర్లలోనే కుప్పకూల్చింది. దీంతో పిచ్ బౌలర్లకు అనుకూలిస్తోందని, మనోళ్లు కూడా అదే రేంజ్‌లో బౌలింగ్ చేస్తారని సగటు క్రికెట్ అభిమాని అనుకున్నాడు. కానీ సీన్ రివర్స్ అయింది. ప్రత్యర్థి బౌలర్లు చెలరేగిన పిచ్‌పై భారత బౌలర్లు తేలిపోయారు. దీంతో న్యూజిలాండ్‌ను తొలి ఇన్నింగ్స్‌లో 91.3 ఓవర్లకిగానీ ఆలౌట్ చేయలేకపోయారు. భారత్ బౌలర్లలో రవీంద్ర జడేజా(Jadeja), కుల్దీప్ యాదవ్(Kuldeep Yadav) చెరో మూడు వికెట్లు, మహ్మద్ సిరాజ్(Siraj) రెండు, బుమ్రా, అశ్విన్ చెరో వికెట్ పడగొట్టారు.

Related Posts

BWF World Championships: సెమీస్‌లో చిరాగ్-సాత్విక్ జోడీ.. సింధుకు తప్పని ఓటమి

పారిస్‌లో జరుగుతున్న బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ (BWF World Championships-2025)లో భారత్‌కు మిశ్రమ ఫలితాలు దక్కాయి. పురుషుల డబుల్స్‌లో సాత్విక్‌ సాయిరాజ్ రంకిరెడ్డి(Satwiksairaj Rankireddy), చిరాగ్ శెట్టి(Chirag Shetty) జోడీ అద్భుత ప్రదర్శనతో సెమీఫైనల్‌(Semifinals)కు చేరి పతకాన్ని ఖాయం చేసుకుంది.…

PKL- 2025: సాగర తీరంలో కబడ్డీ కూత.. నేటి నుంచి పీకేఎల్ సీజన్ 12 షురూ

క‌బ‌డ్డీ అభిమానులు ఎంత‌గానో ఎదురుచూస్తున్న Pro Kabaddi League-2025 వ‌చ్చేసింది. ఇప్ప‌టికే విజ‌యవంతంగా 11 సీజ‌న్లు పూర్తి చేసుకుంది. నేటి (ఆగ‌స్టు 29) నుంచి 12వ సీజ‌న్ (PKL 12) ప్రారంభం కానుంది. ఈ సారి మొత్తం 12 జ‌ట్లు టైటిల్…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *