Vallabhaneni Vamshi: వంశీ అరెస్టు.. బెజవాడలో టెన్షన్ టెన్షన్

YCP నేత, గన్నవరం మాజీ MLA వల్లభనేని వంశీ(Vallabhaneni Vamshi) అరెస్ట్ నేపథ్యంలో విజయవాడలో టెన్షన్ వాతావరణం నెలకొంది. దళితుడిని కిడ్నాప్(Kidnap) చేసి బెదిరించారనే కేసులో పటమట పోలీసులు ఇవాళ ఉదయం వంశీని హైదరాబాద్‌లో అరెస్ట్(Arrest) చేశారు. గచ్చిబౌలి నుంచి విజయవాడకు తీసుకొచ్చారు. YCP నేత అరెస్ట్‌తో జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా పోలీసులు పేర్నినానిని హౌస్ అరెస్ట్ చేశారు. ఆయనపై BNS 140(1), 308, 351, రెడ్ విత్ 3(5) సెక్షన్ల కింద మొత్తం ఏడు కేసులు నమోదు చేశారు. వంశీ అరెస్టుతో అల్లర్లు జరిగే అవకాశం ఉండటంతో పటమట పోలీస్ స్టేషన్ దగ్గర భారీ భద్రత ఏర్పాటు చేశారు. పోలీస్ స్టేషన్ పరిసరాల్లో 144 సెక్షన్ విధించారు.

వైద్య పరీక్షల తర్వాత కోర్టుకు..

తొలుత వంశీని కృష్ణలంక పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లారు.. పోలీస్‌ స్టేషన్‌లో ప్రస్తుతం వంశీని విచారిస్తున్నారు.. అ తర్వాత వైద్య పరీక్షలకు విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రి(Hospital)కి తరలించనున్నారు. వైద్య పరీక్షల అనంతరం గవర్నర్ పేటలో ఉన్న SC, ST కేసుల ప్రత్యక న్యాయస్థానంలో వల్లభనేని వంశీ మోహన్‌ను హాజరుపర్చనున్నారు. కాగా నందిగామ దగ్గర వంశీ భార్య పంకజశ్రీ కారును కూడా పోలీసులు అడ్డుకున్నట్లుగా తెలుస్తోంది. ఇదిలా ఉండగా తప్పుచేసిన వాళ్లకు ఎప్పటికైనా శిక్ష తప్పదంటూ TDP నేతలు కామెంట్ చేస్తున్నారు.

ప్రతిపక్షాన్ని నిందించడమే పరిపాటిగా మారింది: బొత్స

ఇదిలా ఉండగా వంశీ అరెస్టును మాజీ మంత్రి, MLC బొత్స సత్సనారాణ(Botsa Satsanarana) ఖండించారు. ప్రతిపక్షంపై కక్ష సాధింపే లక్ష్యంగా పని చేస్తున్న కూటమి ప్రభుత్వం, ఇష్టారాజ్యంగా అక్రమ కేసులు నమోదు చేస్తోందని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 9 నెలలు అవుతున్నా, పాలన ఇప్పటికీ గాడిలో పడలేదని, అన్నింటికీ YSRCPని నిందించడం పరిపాటిగా మారిందని చెప్పారు. ఫ్రీహోల్డ్‌ భూముల్లో అవినీతి జరిగిందని ఆరోపణలు చేసిన కూటమి నాయకులు, దమ్ముంటే ఆధారాలతో నిరూపించాలని సవాల్‌ చేశారు. అప్పులు తేవడం, హామీల అమలు చేయకపోవడంతో పాటు, డైవర్షన్‌ పాలిటిక్స్‌(Diversion politics) చేయడం తప్ప కూటమి ప్రభుత్వంలో ప్రజలకు ఒక్క మేలు జరగలేదని బొత్స విమర్శించారు.

Botsa Satyanarayana erupts a new controversy, says Hyderabad is capital of  AP till 2024

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *