సీఎం సంచలన నిర్ణయం..116కి.మీటర్లు మెట్రోకు గ్రీన్​ సిగ్నల్​

ManaEnadu: హైదరాబాద్​ మెట్రోరైలు సెకండ్​ ఫేజ్​లో ప్రతిపాదిత కారిడార్ల ఎలైన్‌మెంట్లు ప్రతిపాదనలు సిద్దం చేశారు. ఆరింటిలో ఐదు కారిడార్లకు పూర్తిస్థాయి ప్రాజెక్టు డీపీఆర్​లకు ఆమోదం పడనుంది.116.2 కి.మీ. మెట్రో మార్గాల నిర్మాణానికి రూ.32,237 కోట్ల ఖర్చు అవుతుందని అంచనా వేశారు. ఎయిర్​పోర్ట్​కు వేర్వేరు మార్గాలను పరిశీలించారు.

నాగోల్‌ – చాంద్రాయణగుట్ట–ఆరాంఘర్‌ మీదుగా శంషాబాద్‌ విమానాశ్రయం మార్గానికే సీఎం ఆమోదం తెలిపారు. విమానాశ్రయం నుంచి అవుటర్, రావిర్యాల మీదుగా ఫోర్త్‌సిటీకి మెట్రో ప్రతిపాదనను రెండో దశలోనే చేర్చారు.

ఐదు కారిడార్ల డీపీఆర్‌లు

ఫోర్త్‌సిటీకి రావిర్యాల మీదుగా మెట్రో అనుసంధానానికి ఆకర్షణీయమైన సౌకర్యాలతో వినూత్న రీతిలో డీపీఆర్‌ సిద్ధం చేశారు. సుమారు రూ.8వేల కోట్లు వెచ్చించనున్నారు. ఈ కారిడార్‌ మినహా మిగిలిన ఐదు కారిడార్ల డీపీఆర్‌లను త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వ అనుమతితో కేంద్ర ఆమోదం కోసం పంపబోతుంది. ఇతర మెట్రోరైలు ప్రాజెక్టుల మాదిరిగానే తెలంగాణ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం సంయుక్త ప్రాజెక్టుగా చేపట్టేందుకు ప్రతిపాదించనున్నారు.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *