Rythu Bharosa : రైతులకు గుడ్‌న్యూస్‌.. రైతుభరోసా నిధులు విడుదల

Telangana : తెలంగాణ ప్రభుత్వం రైతులకు గుడ్‌ న్యూస్ చెప్పింది. పంటు పెట్టుబడి సాయం కింద రైతులకు అందించే రైతు భరోసా(Rythu Bharosa) నిధులను వ్యవసాయ శాఖ  విడుదల చేసింది. రూ.2 వేల కోట్లకు పైగా నిధులు విడుదల చేసినట్లు తెలుస్తోంది. మూడు రోజుల్లో చెల్లింపుల ప్రక్రియ పూర్తవుతుందని అధికారులు చెబుతున్నారు. ఇప్పటివరకు 5 ఎకరాలలోపు ఉన్నవారికి మాత్రమే కాంగ్రెస్ సర్కార్(Congress Sarkar) నిధులు విడుదల చేసింది. తాజాగా ఐదు ఎకరాలు పైబడినవారికి చెల్లింపుల ప్రక్రియ ప్రారంభించారు.

నిధులు ఇంకా విడుదల చేయడం లేదని రేవంత్ సర్కార్‌పై బీఆర్‌ఎస్(BRS) నేతలు తీవ్ర విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలోనే అప్రమత్తమైన కాంగ్రెస్ సర్కార్‌ చివరికి ఐదు ఎకరాలు పైబడిన రైతులకు నిధులు విడుదల చేసింది. మరోవైపు ఇటీవల రుణమాఫీకి సంబంధించి కూడా సీఎం రేవంత్ కీలక ప్రకటన చేశారు. ఆగస్ట్ 15వ తేదీ లోపు రుణమాఫీ కూడా చేస్తామని హామీ ఇచ్చారు.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *