బాస్​ను కలిసిన కింగ్.. ANR అవార్డుల వేడుకకు చిరంజీవికి ఆహ్వానం

Mana Enadu : టాలీవుడ్ అగ్రనటులు ఒక వేదికపై కనిపిస్తే అభిమానులకు పండగే పండగ. అది కూడా మెగాస్టార్ చిరంజీవి, నటసామ్రాట్ అక్కినేని నాగార్జున ఒకే వేదిక పంచుకుంటే ఇక సందడి అంతా ఇంతా కాదు. త్వరలోనే ఈ ఇద్దరు స్టార్ హీరోలు ఒక చోటుకు రానున్నారు. ఏఎన్నార్ అవార్డుల(ANR Awards 2024) కార్యక్రమం దీనికి వేదిక కానుంది. ఈ క్రమంలోనే చిరంజీవిని (Chiranjeevi) హీరో నాగార్జున కలిశారు.

త్వరలో జరగనున్న ఏఎన్నార్‌ అవార్డుల కార్యక్రమానికి చిరును నాగ్ ప్రత్యేకంగా ఆహ్వానించారు. ఈ ఫొటోలను నాగార్జున తాజాగా తన సోషల్‌ మీడియాలో షేర్ చేశారు. ‘ఈ ఇయర్ నాకు చాలా స్పెషల్. నాన్న ఏఎన్నార్ శతజయంతి(ANNAR Centenary 2024) వేడుకలు ఘనంగా జరుపబోతున్నాం. ఈ వేడుకకు మెగాస్టార్లు చిరంజీవి, అమితాబ్‌ బచ్చన్‌ రానున్నారు. వారి రాకతో ఈ వేడుక మరింత ప్రత్యేకం కానుంది. ఈ శతజయంతి వేడుకను మరుపురానిదిగా చేద్దాం’ అని పోస్టు కింద అందమైన క్యాప్షన్ జత చేశారు.

2024కు గాను ఏయన్నార్‌ జాతీయ అవార్డు (ANR National Award)ను చిరంజీవికి ఇవ్వనున్నట్టు నాగార్జున (Nagarjuna) గతంలోనే ప్రకటించిన విషయం తెలిసిందే. అక్టోబరు 28వ తేదీన ఈ కార్యక్రమం జరగనుంది. ఈ ఈవెంట్​కు బాలీవుడ్‌ బిగ్ బీ అమితాబ్‌ బచ్చన్‌ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ప్రస్తుతం నాగార్జున షేర్ చేసిన ఫొటోలు నెట్టింట బాగా వైరల్ అవుతోంది. ఇద్దరు స్టార్ హీరోలను ఒకే ఫ్రేమ్​లో చూడటం చాలా ఆనందంగా ఉందంటూ ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు.

ఇక ఈ హీరోల సినిమాల సంగతికి వస్తే సెకండ్ ఇన్నింగ్స్​లో సూపర్ స్పీడ్​గా వెళ్తున్న చిరంజీవి డైరెక్టర్ వశిష్ట తెరకెక్కిస్తున్న ‘విశ్వంభర(Vishwambhara)’ లో నటిస్తున్నారు. ఈ మూవీలో చిరంజీవి హనుమాన్‌ భక్తుడిగా కనిపించనున్నారు. మరోవైపు నాగార్జున.. ధనుష్ ప్రధాన పాత్రలో శేఖర్ కమ్ముల డైరెక్షన్లో వస్తున్న ‘కుబేర(Kubera)’లో నటిస్తున్నారు.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *