మన ఈనాడు: రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఉచిత విద్యత్తు (గృహజ్యోతి) పథకంలో భాగంగా విద్యత్తుశాఖ అధికారులు కసరత్తు ప్రారంభించారు. ఉచిత పథకానికి వివరాలు అందించేందుకు మరో వారం రోజులు గడవు మాత్రమే మిగిలింది.
200యూనిట్ల లోపు వినియోగించే వారికి ఈ పథకం ఉచితంగా వర్తించేలా సీఎం రేవంత్రెడ్డి సర్కారు ఇప్పటికే ప్రకటించింది. ఈక్రమంలోనే సొంతిళ్లుతోపాటు అద్దె ఇళ్లలో నివసిస్తున్న కుటుంభాలు ఈపథకానికి అర్హులేనంటూ ప్రభుత్వం స్పష్టం చేసింది.

ఇంటింటికి విద్యుత్తు సిబ్బంది తిరుగుతూ 200యూనిట్లు లోపు పథకం అమలు చేసేందుకు వినియోగదారుల వివరాలు సేకరించే పనిలో ఉన్నారు. ఈనెల 15నాటికి విద్యుత్తుశాఖ వివరాలు సేకరించాలని నిర్ణయం తీసుకుంది. ఇంకా వారం రోజులు గడవుమాత్రమే మిగలడంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.






