సికింద్రాబాద్​ నుంచి బొంతు రామ్మోహన్​..లైన్​ క్లియర్​

మన Enadu: బీఆర్​ఎస్​ అధినేతతో అత్యంత సన్నిహిత సంబంధాలు ఉండటంతోపాటు తెలంగాణ రాష్ట్రంలో గ్రేటర్​ తొలి మేయర్​గా పనిచేశారు. ఉప్పల్​ టిక్కెట్​ ఆశించినా ఉద్యమ నేతగా తనను మరిచి మరో నాయకుడిగా టిక్కెట్​ అవకాశం ఇవ్వడంతో అసంతృప్తిగా ఉన్నారు. ఇటీవల సీఎం రేవంత్​రెడ్డి సమక్షంలో బొంతు దంపతులు కాంగ్రెస్​లో జాయిన్​ అయ్యారు.

బొంతు రామ్మోహన్​ కాంగ్రెస్​ నుంచి మల్కాజిగిరి టిక్కెట్​ ఆశిస్తున్నారని రాజకీయవర్గాలు భావించాయి.  గ్రేటర్​ హైదరాబాద్​లో బీసీ సామాజిక వర్గంతోపాటు ఉద్యమనాయకుడిగా బొంతు రామ్మోహన్​ బలమైన నేతగా ముద్ర వేసుకున్నారు. ఈక్రమంలోనే అటు బీఆర్​ఎస్​..ఇటు బీజేపీకి గట్టి పోట్టి ఇచ్చే వ్యక్తిగా బొంతుకే కాంగ్రెస్​ పెద్దలు మొగ్గు చూపుతున్నారు.

ఇటీవల బీఆర్​ఎస్​ అధిష్టానంపై ఘాటైన విమర్శలు చేస్తుండటంతో కాంగ్రెస్​ నుంచి ఎంపీ(MP) టిక్కెట్​ కన్ఫర్మ్​ అయినట్లు సమాచారం. దీంతో కేసీఆర్​, కేటీఆర్​పై స్వరం పెంచారు. బీఆర్​ఎస్​ గొంతు కోసిందని బహిరంగంగానే ఆరోపణలు చేశారు. తెలంగాణ కోసం పోరాడిన వ్యక్తిగా పదువలు కాదు..పరువులు తీసుకోలేమని ఓ మీడియా ఇంటర్వ్యూలో ఆవేదన వ్యక్తం చేశారు.

భారతీయ జనతా పార్టీ ఇప్పటికే సికింద్రాబాద్​ నుంచి కిషన్​రెడ్డికి టిక్కెట్​ అధిష్టానం ప్రకటించింది. కిషన్​ రెడ్డిపై పోటీకి బీసీ సామాజిక వర్గం నుంచి మాజీ మేయర్​ బొంతు రామ్మోహన్​ కాంగ్రెస్​ నుంచి పోటీ చేయడమే సరైన అభ్యర్థిగా పార్టీ పెద్దలు భావించారు. ఇప్పటికీ బొంతు పేరును డిల్లీ అధిష్టానానికి పంపించారు. డిల్లీ పెద్దలు బొంతు రామ్మోహన్​కు సికింద్రాబాద్​ నుంచి బరిలో దింపాలని నిర్ణయం తీసుకుంది.

మల్కాజిగిరి నుంచి చంద్రశేఖర్​ , సికింద్రాబాద్​ నుంచి బోంతు రామ్మోహన్​, నల్గొండ నుంచి రఘువీర్​రెడ్డి, నిజమాబాద్​ నుంచి జీవన్​రెడ్డి, భవనగిరి నుంచి కిరణ్​ కుమార్​రెడ్డి పేర్లు ఖారారు అయినట్లు సమాచారం. రేపు అధికారికంగా పేర్లును కాంగ్రెస్​ పెద్దలు ప్రకటించబోతున్నారు.

Related Posts

Assembly Seats: త్వరలో ఏపీ, తెలంగాణలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు!

రాష్ట్రాల అసెంబ్లీ స్థానల పునర్విభజనతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో అసెంబ్లీ స్థానాలు (Telangana Assembly Seats) పెరగవచ్చని తెలుస్తోంది. ఏపీలో 50 (AP Assembly Seats), తెలంగాణ(Telangana)లో 34 కొత్త అసెంబ్లీ స్థానాలు ఏర్పాటు కానున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే ఇది…

గన్నవరం చేరుకున్న ప్రధాని.. కాసేపట్లో అమరావతికి మోదీ

అమరావతి పునరుద్ధరణ పనుల(For Amaravati renovation works)కు శ్రీకారం చుట్టేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(PM Modi) గన్నవరం విమానాశ్రయాని( Gannavaram Airport)కి చేరుకున్నారు. ఆయనకు ఏపీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు, మంత్రులు అనిత, అనగాని, వాసంశెట్టి స్వాగతం పలికారు.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *