Vidaamuyarchi : ఓటీటీలోకి అజిత్‌ ‘పట్టుదల’

కోలీవుడ్ స్టార్ హీరో అజిత్‌ (Ajith Kumar), త్రిష కాంబోలో వచ్చిన లేటెస్ట్ సినిమా ‘విదాముయార్చి’ (Vidaamuyarchi). మాగిజ్‌ తిరుమనేని తెరకెక్కించిన యాక్షన్‌ థ్రిల్లర్‌ ఫిల్మ్‌ తెలుగులో ‘పట్టుదల’ (Pattudala Movie) పేరుతో ఈ నెల 6వ తేదీన విడుదలైన విషయం తెలిసిందే. భారీ అంచనాలతో రిలీజ్ అయిన ఈ సినిమా ప్రేక్షకులను నిరాశ పరిచింది. ఈ క్రమంలోనే ఇప్పుడు ఓటీటీ వేదికగా సందడి చేసేందుకు సిద్ధమైంది.

ఓటీటీలోకి వచ్చేది అప్పుడే

పట్టుదల చిత్రం విడుదలై నెల కూడా తిరక్కముందే ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అయింది. ఈ సినిమా ‘నెట్‌ఫ్లిక్స్‌’ (Netflix)లో మార్చి 3వ తేదీన స్ట్రీమింగ్ కానుంది.  తెలుగు, తమిళ్‌, కన్నడ, మలయాళం, హిందీలో అందుబాటులోకి రానుంది. ఈ విషయాన్ని సోషల్‌ మీడియా వేదికగా సదరు ఓటీటీ సంస్థ ప్రకటించింది (Vidaamuyarchi OTT Release Date). ఈ సినిమాలో అర్జున్‌, రెజీనా కీలక పాత్రల్లో సందడి చేశారు.

అమెరికన్ మూవీ ఆధారంగా

ఇక ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్ (Lyca Productions) బ్యానర్‌ రూపొందించింది. 1997 అమెరికన్ చిత్రం బ్రేక్‌ డౌన్ ఆధారంగా విడాముయర్చిని తెరకెక్కించారు. ఈ మూవీ షూటింగ్ అంతా అజర్‌ బైజాన్‌లో జరిగిన విషయం తెలిసిందే. అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ అందించిన సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమైంది. ఇక అజిత్ ప్రస్తుతం తనకు ఎంతో ఇష్టమైన కారు రేసింగ్ తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *