Andhra Pradesh: వైజాగ్‌లో మరో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం.. ఏకంగా 25 ఎకరాల్లో నిర్మాణం!

ఆంధ్రప్రదేశ్ లో క్రికెట్‌ అభిమానులకు శుభవార్త. విశాఖపట్నంలో మరో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం రాబోతోంది. వైజాగ్ లో కొత్త స్టేడియంతో పాటు ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఏర్పాటు కానుంది. 25 ఎకరాల్లో స్టేడియం, స్పోర్ట్స్ కాంప్లెక్స్ ను నిర్మిస్తారు. ఇక ఈ స్పోర్ట్స్ కాంప్లెక్స్ వివిధ రకాల ఆటల నిర్వహణకు ఆతిథ్యం ఇవ్వనుంది.

రాబోయే 3–4 నెలల్లో కొత్త స్టేడియానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. వైజాగ్ లో ఇప్పటికే వైఎస్ ఆర్ క్రికెట్ స్టేడియం ఉంది. ఇది దేశవాళీ మ్యాచ్ లతో పాటు అంతర్జాతీయ మ్యాచ్ లకూ ఆతిథ్యం ఇస్తోంది. ఇప్పుడు కొత్త స్టేడియం ఏ ప్రాంతంలో ఏర్పాటు చేస్తారు? నిర్మాణ వ్యయం ఎంత? అనేదానిపై వివరాలు తెలియాల్సి ఉంది.

స్టేడియంతో పాటు స్పోర్ట్స్ కాంప్లెక్స్‌ ఏర్పాటుకు రంగం సిద్ధం
శంకుస్థాపన చేయనున్న సీఎం వైఎస్ జగన్
నగరంలో ఇప్పటికే ఉన్న ఓ అంతర్జాతీయ స్టేడియం

విశాఖలో ఈ నెల 16 నుంచి ఆంధ్రా ప్రీమియర్ లీగ్ ప్రారంభం కానుంది. క్రికెట్ అభిమానులకు అపుడే ఫీవర్ స్టార్ట్ అయింది. రానున్న రోజుల్లో ఇంటర్నేషనల్ మ్యాచెస్ విశాఖ కేంద్రంగా ఎక్కువ జరిగేలా చేసేందుకు కొత్తగా నిర్మిస్తున్న ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం ఉపయోగపడుతుంది అని అంటున్నారు.

  • Related Posts

    ICC Rankings 2025: ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్.. టాప్-5కి చేరువలో పంత్

    టీమ్ఇండియా(Team India) స్టార్ ప్లేయర్, వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్(Rishabh Pant) ఐసీసీ ర్యాంకింగ్స్‌(ICC Rankings)లో సత్తా చాటాడు. ఇంగ్లండ్‌(England)తో సిరీస్‌లో భాగంగా తొలి టెస్టులో రెండు సెంచరీలు(Two Centuries) చేయడంతో పంత్ తన ర్యాంకును మెరుగుపర్చుకున్నాడు. ఈ మేరకు…

    IND vs ENG 2nd Test: గిల్ కెప్టెన్ ఇన్నింగ్స్.. పటిష్ఠ స్థితిలో భారత్

    బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్‌(Edgbaston)లో జరిగిన ఇంగ్లండ్‌(England)తో రెండో టెస్టు మ్యాచ్‌లో టీమిండియా(Team India) తొలి రోజు ఆట ముగిసే సమయానికి 5 వికెట్ల నష్టానికి 310 పరుగులు సాధించి బలమైన స్థితిలో నిలిచింది. ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్(Ben Stokes) టాస్ గెలిచి…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *