తెలంగాణ సీఎం రేవంత్(CM Revanth) ఢిల్లీలో బిజీబిజీగా ఉన్నారు. ఒకవైపు ప్రభుత్వ పరంగా కేంద్ర ప్రభుత్వ పెద్దలను కలుస్తూనే అటు కాంగ్రెస్ అధిష్ఠాన పెద్దలతో భేటీకి ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఇవాళ సాయంత్రం రాహుల్ గాంధీ(Rahul Gandhi)తో పాటు పార్టీ ఛీఫ్ AICC అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో సమావేశంకానున్నారు. అలాగే విదేశాంగ మంత్రి జైశంకర్(External Affairs Minister Jaishankar)తో రేవంత్ భేటీ అవుతారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు(Phone tapping case) విషయం చర్చించేందుకు ఆయనతో CM చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో కీలక నిందితులు విదేశాల్లో తలదాచుకుంటుండగా వారిని ఎలాగైనా స్వదేశానికి రప్పించి, శిక్ష పడేటట్లు చేయాలని కోరనున్నారు. మరోవైపు మంత్రి వర్గ విస్తరణ(Cabinet expansion)పై పార్టీ పెద్దలను కలిసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
రేసులో విజయశాంతి, అద్దంకి
కొత్తగా జరిగే మంత్రివర్గ విస్తరణలో కొత్తగా ఆరుగురికి మాత్రమే అవకాశం ఉంది. ఇప్పటికే ఎమ్మెల్సీగా ఎన్నికైన విజయశాంతి(MLC Vijayashanti)తో పాటు అద్దంకి దయాకర్(Addanki Dayakar) కూడా మంత్రి రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ అద్దంకి దయాకర్కు మంత్రి పదవి వరిస్తే.. అటు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్కు చెక్ పడినట్టే. ఒకవేళ మాల వర్గానికి సంబంధించి వారికి మంత్రి వర్గంలో తీసుకుంటే వీళ్లిద్దరిలో ఎవరో ఒకరికి మాత్రమే మంత్రి పదవి వరించే అవకాశం ఉంది.

మొత్తం 18 మందికే ఛాన్స్
మరోవైపు మక్తల్ MLA వాకిటి శ్రీహరిని మంత్రి వర్గంలో తీసుకోబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. అటు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి(Komatireddy Rajagopal Reddy) కూడా ఈ సారి మంత్రి కావాలని ట్రై చేస్తున్నారు. ఇప్పటికే కోమటిరెడ్డి అన్న వెంకట్ రెడ్డి మంత్రిగా ఉండటంతో ఈయనకు క్యాబినేట్లో చోటు దక్కడం డౌటే అని చెబుతున్నారు. TGలో మొత్తంగా 18 మందికి ఛాన్స్ ఉంది. ఇప్పటికే మంత్రి వర్గంలో CMతో కలిపి దాదాపు నలుగురు రెడ్లు ఉన్నారు. ఈసారి విస్తరణలో 4 నలుగురికి ఛాన్స్ ఇచ్చే అవకాశాలున్నాయి. అందులో ఒకటి కొత్తగా ఎన్నికైన MLCకి ఇచ్చే అవకాశం ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి.








