బంగారం కొనాలా?.. నేటి ధరలు ఎలా ఉన్నాయంటే?

దేశంలో బంగారం, వెండి ధరలు రోజురోజుకు పెరుగుతున్నాయి. మరికొన్ని రోజుల్లో 10 గ్రాముల బంగారం ధర లక్ష రూపాయలకు చేరుకోనుంది. సామాన్యులు పసిడి కొనాలంటే జంకే పరిస్థితులు నెలకొన్నాయి. ఇక పెళ్లిళ్ల సీజన్ కావడంతో ఇప్పట్లో మధ్యతరగతి వాళ్లు బంగారం కొనడానికి భయపడుతున్నా.. శుభకార్యాలకు కొనక తప్పడం లేదు. ఇక ఇవాళ వెండి ధరలు కాస్త తగ్గుముఖం పట్టాయి.

తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన బంగారం ధర

సోమవారం రూ.89,080 ఉన్న 10 గ్రాముల​ బంగారం ధర.. మంగళవారం నాటికి నాటికి రూ.150 పెరిగి రూ.89,230కు చేరుకుంది. ఇక కిలో వెండి ధర సోమవారం రూ.99,148 ఉండగా, మంగళవారం నాటికి రూ.310 తగ్గి రూ.98,838 వద్ద పలుకుతోంది. ఇక తెలుగు రాష్ట్రాల్లోనూ పసిడి, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. హైదరాబాద్, ప్రొద్దుటూరు, విశాఖపట్నం, విజయవాడలోనూ పుత్తడి ధరలు రూ.89,000ల దాకా చేరింది. మరి ఈ నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఓసారి చూద్దామా..?

బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి

  1. హైదరాబాద్​లో 10 గ్రాముల​ పసిడి ధర రూ.89,230.. కిలో వెండి ధర రూ.98,838
  2. విజయవాడలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.89,230.. కిలో వెండి ధర రూ.98,838
  3. విశాఖపట్నంలో 10 గ్రాముల బంగారం ధర  రూ.89,230.. కిలో వెండి ధర రూ.98,838
  4. ప్రొద్దుటూరులో 10 గ్రాముల పసిడి ధర రూ.89,230.. కిలో వెండి ధర రూ.98,838.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *