ND vs NZ: భారత్‌కు తప్పని భంగపాటు.. తొలిటెస్టు‌లో న్యూజిలాండ్ ఘనవిజయం

Mana Enadu: బెంగళూరు టెస్టు(Bangalore Test)లో భారత్‌కు భంగపాటు తప్పలేదు. చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన తొలి టెస్టులో టీమ్ ఇండియా(Team India)పై కివీస్ జట్టు 8 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. 107 పరుగుల స్వల్ప లక్ష్యంతో ఇవాళ ఐదోరోజు బ్యాటింగ్ చేసిన ఆ జట్టుకు భారత పేస్ గన్ బుమ్రా(Bumrah) ఆదిలోనే షాకిచ్చాడు. న్యూజిలాండ్(New Zealand) కెప్టెన్ టామ్ లాథమ్‌(0)ను ఇన్ స్వింగర్‌తో ఎల్బీగా పెవిలియన్ పంపించాడు. మరో ఓపెనర్ డెవాన్ కాన్వే (17) పరుగులు చేసి బుమ్రా బౌలింగ్‌లోనే ఔటయ్యాడు. అయితే కివీస్ బ్యాటర్లు విల్ యంగ్(45), రచిన్ రవీంద్ర(39) మరో వికెట్ పడకుండా లాంఛనం పూర్తి చేశారు. కాగా 36 ఏళ్ల తర్వాత భారత గడ్డపై న్యూజిలాండ్ గెలవడం విశేషం. చివరగా ఆజట్టు భారత గడ్డపై 1988లో నెగ్గింది.

https://twitter.com/Cricmemer45/status/1847894423021007204

 తొలి ఇన్నింగ్సే కొంపముంచింది..

ఈ టెస్ట్‌లో టాస్‌(Toss) గెలిచి మొదట బ్యాటింగ్‌ చేసిన భారత్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 46 పరుగులకే కుప్పకూలింది. ఆ తర్వాత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో రచిన్ రవీంద్ర (134), కాన్వే (91), సౌథీ(65) పరుగులు సాధించడంతో 402 భారీ స్కోరు సాధించింది. దీంతో భారత్‌కు సెకండ్ ఇన్నింగ్స్‌(Second innings)లో భారీ లీడ్ ఇచ్చింది. రెండో ఇన్నింగ్స్‌లో భారత్ దీటుగానే ఆడినా కివీస్ తగినంత టార్గెట్ ఇవ్వలేకపోయింది. రెండో ఇన్నింగ్స్‌లో సర్ఫరాజ్ ఖాన్(Sarfraj Khan) (150), పంత్(99), కోహ్లీ (70), రోహిత్ (52) రన్స్ చేశారు. మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. కివీస్ బౌలర్లలో విలయం, హెన్రీ చెరో మూడు వికెట్లు పడగొట్టగా, అజాజ్ పటేల్ రెండు వికెట్లు తీశాడు. ఈ విజయంతో న్యూజిలాండ్ మూడు టెస్టుల సిరీస్‌లో 1-0 ఆధిక్యం సాధించింది. కాగా రెండో టెస్టు ఈనెల 24 నుంచి పుణే(PUNE)లో జరగనుంది.

https://twitter.com/mufaddal_vohra/status/1847896509884325922

Related Posts

BWF World Championships: సెమీస్‌లో చిరాగ్-సాత్విక్ జోడీ.. సింధుకు తప్పని ఓటమి

పారిస్‌లో జరుగుతున్న బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ (BWF World Championships-2025)లో భారత్‌కు మిశ్రమ ఫలితాలు దక్కాయి. పురుషుల డబుల్స్‌లో సాత్విక్‌ సాయిరాజ్ రంకిరెడ్డి(Satwiksairaj Rankireddy), చిరాగ్ శెట్టి(Chirag Shetty) జోడీ అద్భుత ప్రదర్శనతో సెమీఫైనల్‌(Semifinals)కు చేరి పతకాన్ని ఖాయం చేసుకుంది.…

PKL- 2025: సాగర తీరంలో కబడ్డీ కూత.. నేటి నుంచి పీకేఎల్ సీజన్ 12 షురూ

క‌బ‌డ్డీ అభిమానులు ఎంత‌గానో ఎదురుచూస్తున్న Pro Kabaddi League-2025 వ‌చ్చేసింది. ఇప్ప‌టికే విజ‌యవంతంగా 11 సీజ‌న్లు పూర్తి చేసుకుంది. నేటి (ఆగ‌స్టు 29) నుంచి 12వ సీజ‌న్ (PKL 12) ప్రారంభం కానుంది. ఈ సారి మొత్తం 12 జ‌ట్లు టైటిల్…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *