‘కుదిరితే బాబా లేకుంటే జిషాన్‌.. ఎవరు కనిపిస్తే వాళ్లని కాల్చేయండి’

Mana Enadu : మాజీ మంత్రి, ఎన్సీపీ సీనియర్‌ నేత బాబా సిద్ధిఖీ (Baba Siddique) ఇటీవల హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ కేసులో పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు శివకుమార్‌ను పోలీసులు అరెస్టు చేసి విచారించగా పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. కుదిరితే బాబా సిద్ధిఖీని, లేకుంటే ఆయన కుమారుడు జిషాన్‌ సిద్ధిఖీని హత్య చేయాలని గ్యాంగ్‌స్టర్‌ లారెన్స్‌ బిష్ణోయ్‌ (Lawrence Bishnoi) సోదరుడు అన్మోల్‌ బిష్ణోయ్‌ (Anmol Bsihnoi) తనను ఆదేశించినట్లు నిందితుడు పోలీసుల ఎదుట చెప్పినట్లు సమాచారం.

పోలీసు వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం..

‘బాబా, జిషాన్ లలో ఎవరు ముందు చూస్తే వారిని కాల్చేయండి’ అని అన్మోల్‌ బిష్ణోయ్‌ తనను ఆదేశించినట్లు నిందితుడు శివకుమార్‌ పోలీసులకు తెలిపాడు. దేవుడు, సమాజం కోసమే తాను ఇదంతా చేస్తున్నట్లు అన్మోల్‌ చెప్పాడని అన్నాడు. హత్యానంతరం నిందితుడు చొక్కా మార్చుకొని ఆటోలో ఠానే లోకల్‌ రైలు ఎక్కి పుణే పారిపోయాడని పోలీసులు తెలిపారు.

దేశం విడిచి వెళ్లాలని ప్లాన్

ఆ తర్వాత ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీ, లఖ్‌నవూ, బహ్రాయిచ్‌లలో దాక్కుని.. దేశం విడిచి వెళ్లిపోవాలనుకున్నాడని చెప్పారు. అయితే వెళ్లే ముందు ఉజ్జయిని, వైష్ణోదేవీ ఆలయాలను సందర్శించాలని ప్లాన్‌ చేసుకున్నట్లు పోలీసుల విచారణలో తేలినట్లు సమాచారం.  షూటర్‌తో పాటు అరెస్టయిన ఓ వ్యక్తి సెల్‌ఫోన్‌లో జిషాన్‌ సిద్ధిఖీ(Zeeshan Siddique) ఫొటో కనిపించడంతో విచారించగా నిందితుడు ఈ విషయం తెలిపినట్లు పోలీసులు వెల్లడించారు.

యూపీలో అరెస్టు చేసిన ముంబయి పోలీస్

ఇక అక్టోబరు 12వ తేదీన బాబా సిద్ధిఖీ (Baba Siddique Murder) మంబయిలోని తన కుమారుడి కార్యాలయంలో ఉండగా.. కొందరు దుండగులు కాల్చి చంపిన విషయం తెలిసిందే. ఈ ఘటన తర్వాత దాడికి పాల్పడింది తామేనని లారెన్స్‌ బిష్ణోయ్‌ గ్యాంగ్‌ ప్రకటించింది. ఈ కేసులో దాదాపు 20 మంది నిందితులను అరెస్టు చేయగా.. షూటర్లలో ఒకడైన శివకుమార్ తో పాటు అతడికి ఆశ్రయం కల్పించిన మరో నలుగురిని యూపీలో ముంబయిలో పోలీసులు ఆదివారం రోజున అరెస్టు చేశారు. 

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *