India vs South Korea: కొరియాను చిత్తు చేసిన భారత్.. టైటిల్ కోసం చైనాతో ఢీ

ManaEnadu: ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నీ(Asia Champions Trophy Hockey Tournament)లో భారత్ దుమ్మురేపుతోంది. అద్భుతమైన ఆటతీరుతో మెన్ ఇన్ బ్లూ(Men In Blue) ఘన విజయాలు సాధిస్తూ ఫైనల్‍కు దూసుకెళ్లింది. చైనాలోని మోకీ వేదికగా సోమవారం (సెప్టెంబర్ 16) జరిగిన సెమీఫైనల్‍లో దక్షిణ కొరియా(South Korea)పై టీమ్ఇండియా గ్రాండ్ విక్టరీ కొట్టింది. సెమీస్‍లో హర్మన్ ప్రీత్ సేన 4-1 తేడాతో కొరియాపై ఘన విజయం సాధించింది. ఆరంభం నుంచి దూకుడుగా ఆడిన భారత్.. మ్యాచ్ పూర్తయ్యే వరకూ ఆధిపత్యం ప్రదర్శించి గెలిచింది. కాగా.. ఈ టోర్నీలో భార‌త జ‌ట్టు ఫైన‌ల్‌కు చేరుకోవ‌డం ఇది ఆరోసారి కావ‌డం విశేషం. ఇప్ప‌టి వ‌ర‌కు టీమ్ఇండియా(Team India) నాలుగు సార్లు విజేత‌గా నిలిచింది. ఈ సారి కూడా గెలిచి ఐదోసారి ఛాంపియ‌న్‌గా నిలవాల‌ని మెన్ ఇన్ బ్లూ భావిస్తోంది.

 ప్రారంభం నుంచి భారత్‌దే పైచేయి

కాగా మ్యాచ్ ప్రారంభమైన 13వ నిమిషంలోనే ఉత్తమ్ సింగ్ గోల్(Goal) బాదాడు. దీంతో భారత్ అకౌంట్ తెరిచింది. ఆ తర్వాత 19వ నిమిషంలో హర్మన్ ప్రీత్ సింగ్(Harman Preet) మరో గోల్ సాధించాడు. దీంతో హాఫ్ టైమ్ ముగిసే సరికి ఇండియా 2-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. జర్మన్‍ప్రీత్ సింగ్ 32వ నిమిషంలో మరో గోల్ కొట్టాడు. అయితే, ఆ తర్వాతి నిమిషంలోనే కొరియా ప్లేయర్ జిహూన్ యాంగ్ గోల్ చేశాడు. ఆ తర్వాత ఇరు జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. గోల్ పోస్ట్ పై రెండు జట్లూ అటాకింగ్‌కు దిగాయి. ఈ సమయంలో భారత ప్లేయర్ హర్మన్ ప్రీత్ సింగ్ 45వ నిమిషంలో మరో గోల్ చేశాడు. దీంతో స్కోరు 4-1కు చేరింది. చివరి వరకు ఆధిపత్యాన్ని నిలుపుకొని విజయం భారత్ మరుపురాని విజయాన్ని సొంతం చేసుకుంది.

వరుసగా ఐదు మ్యాచుల్లో జయభేరి

గ్రూపు ద‌శ‌లో వ‌రుస‌గా ఐదు మ్యాచుల్లో గెలిచింది భార‌త్. చైనాను 3-0 గోల్స్‌ తేడాతో మట్టికరిపించింది. ఇక రెండో లీగ్ మ్యాచ్‌లో జపాన్‌ను 5-1తో చిత్తు చేసింది. ఆ తర్వాత మలేషియాను 8-1తో, పాకిస్థాన్‌ను 2-1తో ఓడించింది. అదే ఊపులో సెమీఫైన‌ల్‌లోనూ విజ‌యం సాధించి అజేయంగా ఫైన‌ల్‌(Final)కు చేరుకుంది. ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‍లో చైనా(Chaina)తో టీమ్ఇండియా తలపడనుంది. ఈ టైటిల్ పోరు మంగళవారం (సెప్టెంబర్ 17) మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రారంభం కానుంది.

 

Related Posts

BWF World Championships: సెమీస్‌లో చిరాగ్-సాత్విక్ జోడీ.. సింధుకు తప్పని ఓటమి

పారిస్‌లో జరుగుతున్న బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ (BWF World Championships-2025)లో భారత్‌కు మిశ్రమ ఫలితాలు దక్కాయి. పురుషుల డబుల్స్‌లో సాత్విక్‌ సాయిరాజ్ రంకిరెడ్డి(Satwiksairaj Rankireddy), చిరాగ్ శెట్టి(Chirag Shetty) జోడీ అద్భుత ప్రదర్శనతో సెమీఫైనల్‌(Semifinals)కు చేరి పతకాన్ని ఖాయం చేసుకుంది.…

PKL- 2025: సాగర తీరంలో కబడ్డీ కూత.. నేటి నుంచి పీకేఎల్ సీజన్ 12 షురూ

క‌బ‌డ్డీ అభిమానులు ఎంత‌గానో ఎదురుచూస్తున్న Pro Kabaddi League-2025 వ‌చ్చేసింది. ఇప్ప‌టికే విజ‌యవంతంగా 11 సీజ‌న్లు పూర్తి చేసుకుంది. నేటి (ఆగ‌స్టు 29) నుంచి 12వ సీజ‌న్ (PKL 12) ప్రారంభం కానుంది. ఈ సారి మొత్తం 12 జ‌ట్లు టైటిల్…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *