తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్(Mahesh Kumar Goud) ఆధ్వర్యంలో టీకాంగ్రెస్ జనహిత పాదయాత్ర (Janahita Padayatra) యాత్ర నిర్వహించనుంది. ఏఐసీసీ తెలంగాణ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్(Meenakshi Natarajan) సైతం ఈ యాత్రం పాల్గొంటారు. ఈ సందర్భంగా నేటి నుంచి ఆగస్టు 4 వరకు ఐదురోజుల పాటు పాదయాత్ర చేయనున్నారు. వికారాబాద్ జిల్లా(Vikarabad District) పరిగి నియోజకవర్గం నుంచి ఈ యాత్ర ప్రారంభమై, వర్ధన్నపేట వరకు కొనసాగనుంది. ఈ కార్యక్రమం ద్వారా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల(Local body elections) కోసం కాంగ్రెస్ పార్టీ గ్రామీణ స్థాయిలో బలోపేతం చేయాలని కాంగ్రెస్ హైకమాండ్ భావిస్తోంది.
రెండో విడతగా పాదయాత్ర, శ్రమదానాలు
‘‘రాష్ట్రంలో గురువారం నుంచి ఆగస్టు 4 వరకు మొదటి విడత జనహిత పాదయాత్ర(Janahita Padayatra) ఉంటుంది. ఇందులో భాగంగా శ్రమదానాలు సైతం నిర్వహిస్తాం. తొలిరోజున రంగారెడ్డి జిల్లా పరిగిలో ప్రారంభిస్తారు. ఆగస్టు 4న ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్లో సమావేశం ఉంటుంది. 5, 6, 7 తేదీల్లో దిల్లీలో కార్యక్రమాలు ముగిశాక రెండో విడతగా పాదయాత్ర, శ్రమదానాలు ఆగస్టు 8 నుంచి యథావిధిగా కొనసాగుతాయి’’ అని మహేశ్కుమార్గౌడ్ CMకి వివరించారు. ఈ కార్యక్రమాల్లో తాను కూడా పాల్గొంటున్నట్లు మీనాక్షి నటరాజన్ తెలిపారు.
బీసీ రిజర్వేషన్లపై ఆందోళన
ఇదిలా ఉండగా బీసీ రిజర్వేషన్ల(BC Reservations) కోసం ఢిల్లీలో ఆగస్టు 5 నుంచి 7 వరకు ఆందోళన కార్యక్రమాలను ప్లాన్ చేశారు. ఈ ఆందోళనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy), మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, బీసీ సంఘాల నాయకులు పాల్గొననున్నారు. ఆగస్టు 7న రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము(Droupadi Murmu)కు వినతిపత్రం సమర్పిస్తారు. ఈ పాదయాత్ర ద్వారా కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో బలోపేతం చేసుకోవడంతో పాటు ప్రజల్లో పట్టు సాధించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.







