‘పుష్ప 2’ స్క్రీనింగ్ లో ‘స్ప్రే’ కలకలం.. ప్రేక్షకులకు వాంతులు

Mana Enadu : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ (Allu Arjun) హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘పుష్ప: ది రూల్‌’ (Pushpa 2) ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్‌ 5వ తేదీ నుంచి థియేటర్లలో విడుదలైంది. మొదటి రోజే ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఏకంగా ఫస్ట్ డే ప్రపంచ వ్యాప్తంగా రూ.175 కోట్ల కలెక్షన్లు సంపాదించినట్లు సమాచారం. దేశవ్యాప్తంగా ఈ సినిమా థియేటర్లలో విజయవంతంగా రన్ అవుతున్నా.. కొన్ని ప్రాంతాల్లో మాత్రం పలు అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకుంటున్నాయి.

పుష్ప-2 స్క్రీనింగ్ లో అనూహ్య ఘటన

తాజాగా ముంబయిలోని ఓ థియేటర్‌లో పుష్ప-2 (Pushpa 2 Spray Incident) సినిమా ప్రదర్శన కొనసాగుతున్న సమయంలో అనూహ్య సంఘటన చోటుచేసుకుంది. గుర్తు తెలియని ఓ వ్యక్తి థియేటర్‌లో ఘాటైన స్ప్రే కొట్టడంతో ప్రేక్షకులు ఆందోళనకు గురయ్యారు. స్ప్రే ధాటికి చాలా మంది ప్రేక్షకులు దగ్గు, వాంతులతో ఇబ్బందులు పడ్డారు. అసలు ఆ వ్యక్తి ఏ స్ప్రే కొట్టాడో.. ఇలాంటి ఘటనకు ఎందుకు పాల్పడ్డాడో తెలియరాలేదు. అసలేం జరిగిందంటే..?

పుష్ప-2 ప్రదర్శనలో ఆడియెన్స్ కు వాంతులు

డిసెంబరు 5 గురువారం రాత్రి బాంద్రాలోని ఓ థియేటర్‌లో సెకండ్‌ షో పుష్ప-2 (Pushpa 2 Bandra Incident) సినిమా ప్రదర్శన కొనసాగుతోంది. అయితే ఈ సమయంలో థియేటర్లో ఓ గుర్తు తెలియని వ్యక్తి ఘాటైన స్ప్రే కొట్టడంతో ప్రేక్షకులు దగ్గు, వాంతులతో ఇబ్బందులు పడ్డారు. ఆడియెన్స్ ఇబ్బంది పడటంతో థియేటర్‌ యాజమాన్యం కాసేపు షోను నిలిపివేసింది.

థియేటర్ లో ఘాటైన స్ప్రే

ఆ తర్వాత పోలీసులకు సమాచారం అందించగా.. వారు అక్కడికి చేరుకున్నారు. అనంతరం పోలీసులు హాలులోని ప్రతి ఒక్కరినీ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఇంటర్వెల్‌ సమయంలో బయటకు వచ్చి తిరిగి లోపలికి వెళ్లిన తర్వాత అందరికీ దగ్గు, వాంతులు వచ్చినట్లు ప్రేక్షకులు తెలిపారు. ఇక పోలీసులు వచ్చి తనిఖీ చేసిన తర్వాత 20 నిమిషాలకు తిరిగి షో ప్రారంభమైంది.

Related Posts

Allu Kanakaratnamma: అల్లు అర్జున్ ఇంట విషాదం.. అల్లు కనకరత్నమ్మ కన్నుమూత

టాలీవుడ్‌(Tollywood)లో ప్రముఖ నిర్మాత, గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్(Allu Aravind) ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తల్లి, దివంగత హాస్య నటుడు అల్లు రామలింగయ్య భార్య అల్లు కనకరత్నమ్మ (Allu Kanakaratnamma, 94) శనివారం తెల్లవారుజామున 1:45 గంటలకు…

Megastar Chiranjeevi: చిరూని కలిసి మహిళా వీరాభిమాని.. రాఖీ కట్టి తీవ్ర భావోద్వేగం 

కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) వీరాభిమాని రాజేశ్వరి(Rajeshwari), తన ఆరాధ్య నటుడిని కలిసేందుకు సైకిల్‌(Cycle)పై సుదీర్ఘ ప్రయాణం చేసి హైదరాబాద్(Hyderabad) చేరుకున్నారు. ఈ సంఘటన చిరంజీవిని ఆశ్చర్యంలో ముంచెత్తడమే కాక, అభిమానుల హృదయాలను కూడా కదిలించింది. రాజేశ్వరి…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *