Liquor shops closed Today: మందు బాబులకు బ్యాడ్ న్యూస్.. ఈ రోజు వైన్స్ బంద్!

Liquor shops closed Today: ముందు బాబులకు బ్యాడ్ న్యూస్. ఈ రోజు నగరంలో వైన్ షాపులు మూసివేయనున్నారు. 23 ఉదయం 6:00 నుంచి 24 ఉదయం 6:00 వరకు మద్యం షాపులు మూసివేయనున్నట్లు సైబరాబాద్ సీపీ అవినాష్ మొహంతి తెలిపారు.

హనుమాన్ జయంతి సందర్భంగా మంగళవారం శోభాయాత్రను వైభవంగా నిర్వహించనున్నారు. ఈ శోభాయాత్ర గౌలిగూడలోని రాంమందిర్ నుంచి సికింద్రాబాద్ తాడ్ బంద్ హనుమాన్ ఆలయం వరకు జరగనుంది. ఈ నేపథ్యంలో ఈ రోజు హైదరాబాద్ లోని బార్లు, మద్యం దుకాణాలు బంద్ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఇప్పటికే శోభాయాత్ర రూట్ మ్యాప్ ను పోలీసులు ఇప్పటికే పరిశీలించారు. ఈ యాత్రలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా యాత్ర కొనసాగే అన్ని ప్రాంతాల్లోను భారీగా బందోబస్తును ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

ఈ నేపథ్యంలో 23వ తేదీన ఉదయం 6 గంటల నుంచి 24వ తేదీ ఉదయం 6 గంటల వరకు వైన్స్, బార్ షాప్స్ మూసివేస్తున్నట్లు సీపీ అవినాష్ మొహంతి వెల్లడించారు. శోభాయాత్ర నేపథ్యంలో నగరంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా మద్యం షాపులను బంద్ చేస్తున్నట్లు తెలిపారు. ఎవరైనా సరే నిబంధనలను అతిక్రమించి మద్యం దుకాణాలు తెరిచి అమ్మకాలు చేపడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *