CM Revanth Reddy: రేపు ఢిల్లీకి సీఎంతోపాటు డీప్యూటీ సీఎం.. ప్రధానితో మీటింగ్ షెడ్యూల్​ ఫిక్స్!

మన ఈనాడు:సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క రేపు ఢిల్లీకి వెళ్లనున్నారు. రేపు సాయంత్రం 4.30 గంటలకు ప్రధాని మోదీతో సీఎంతోపాటు డిప్యూటీ సీఎం భేటీ కానున్నట్లు అధికారికంగా అందుతున్న సమాచారం. అనంతరం హైకమాండ్ పెద్దలతో సమావేశమై నామినేటెడ్ పోస్టులు, ఎమ్మెల్సీ పదవుల భర్తీతో పాటు మంత్రివర్గ విస్తరణపై చర్చించనున్నట్లు తెలుస్తోంది.

రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధులపై ప్రధానితో సీఎం రేవంత్​రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి చర్చించే అవకాశం ఉంది. ప్రధానితో భేటీ తర్వాత హైకమాండ్ పెద్దలతో వారిద్దరూ సమావేశం కానున్నారు.

రేపు మధ్యాహ్నం 12 గంటలకు బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి ఢిల్లీకి వెళ్లనున్నారు. ప్రధానితో సమావేశం తర్వాత వీరు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, సోనియా, రాహుల్, ప్రియాంకతో వీరు భేటీ అవనున్నారు. నామినేటెడ్ పోస్టులు, ఎమ్మెల్సీ అభ్యర్థుల భర్తీతో పాటు మంత్రివర్గ విస్తరణపై హైకమాండ్ పెద్దలతో చర్చించనున్నట్లు తెలుస్తోంది.

Related Posts

Local Body Elections: స్థానిక సంస్థల ఎన్నికలకు బ్రేక్.. మళ్లీ ఎప్పుడంటే?

తెలంగాణ(Telangana)లో స్థానిక సంస్థల ఎన్నికల(Local Body Elections)కు బ్రేక్ పడినట్లుగానే తెలుస్తోంది. రాష్ట్రంలో మరోసారి కులగణనకు(to the census) సీఎం రేవంత్ సర్కార్ అవకాశం కల్పించడంతో లోకల్ బాడీ ఎన్నికలకు బ్రేక్ పడినట్లుగానే కనిపిస్తోంది. ప్రభుత్వ తాజా నిర్ణయం మేరకు ఈ…

Official Announcement: రాహుల్ వరంగల్ పర్యటన రద్దు

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) తెలంగాణ పర్యటన(Telangana Tour) రద్దు అయ్యింది. రాహుల్‌ గాంధీ షెడ్యూల్ ప్రకారం ఈ రోజు హనుమకొండ(Hanumakonda)లో పర్యటించాల్సి ఉంది. ఢిల్లీ నుంచి హైదరాబాద్‌(Delhi-Hyd)కు వచ్చి.. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో హనుమకొండకు ఆయన చేరుకుంటారని తొలుత…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *