మన ఈనాడు:తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని దూషించిన కేసులో పరారీలో ఉన్న భారాస చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ నేపాల్ లో ప్రత్యక్షమైనట్లు సమాచారం. సీఎంను దూషించడంతో పాటు చెప్పు చూపించినందుకు మంచిర్యాలతో సహా పలు పోలీస్ స్టేషన్లో బాల్క సుమన్పై కేసు నమోదైంది. ప్రెస్ మీట్ పెట్టిన వెంటనే పరిణామాలు ఊహించి కేటీఆర్ ఇంటికి చేరుకున్న సుమన్.. అధిష్టానం చేతులెత్తేయడంతో అక్కడి నుంచి మధ్యప్రదేశ్, వయా ఉత్తరప్రదేశ్ చేరుకున్నారని.. అక్కడి నుంచి నేపాల్ పారిపోయారని తెలిసింది. లుకవుట్ నోటీసు జారీ చేసిన పోలీసులు ఆయన కోసం గాలింపు చర్యలు చేపట్టగా.. కాట్మండులోని డ్యాన్సింగ్ యాక్ పబ్లో సుమన్ ను గుర్తించిన ఓ తెలంగాణ వాసి ఇక్కడి పోలీసులకు సమాచారం అందించారు.
గన్నవరం చేరుకున్న ప్రధాని.. కాసేపట్లో అమరావతికి మోదీ
అమరావతి పునరుద్ధరణ పనుల(For Amaravati renovation works)కు శ్రీకారం చుట్టేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(PM Modi) గన్నవరం విమానాశ్రయాని( Gannavaram Airport)కి చేరుకున్నారు. ఆయనకు ఏపీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు, మంత్రులు అనిత, అనగాని, వాసంశెట్టి స్వాగతం పలికారు.…