మన ఈనాడు:తెలంగాణలో జరిగిన సాధారణ ఎన్నికల్లో కరీంనగర్ నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన అభ్యర్థి పురుమళ్ల శ్రీనివాస్ కు ఆ పార్టీ షాకిచ్చింది. గత ఎన్నికల్లో భారతీయ రాష్ట్ర సమితి అభ్యర్థి గంగుల కమలాకర్ తో కుమ్మక్కై పార్టీ ఓడిపోయేలా చేశారంటూ పార్టీ క్రమశిక్షణ కమిటీ శుక్రవారం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఈ ఎన్నికల ప్రచారంలో పార్టీ అందించిన నిధులను ఖర్చు చేయకపోవడంతో పాటు భారాస, భాజపా అభ్యర్థులకు సహకారం అందించారని.. ప్రచారానికి ఇతర రాష్ట్రాల ప్రతినిధులు, ఏఐసీసీ ప్రముఖులు వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కనీస సమాచారం అందించలేదని పేర్కొంటూ క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ చిన్నారెడ్డి నోటీసుల్లో పేర్కొన్నారు. దీనిపై మూడు రోజుల్లో లిఖిత పూర్వక వివరణ ఇవ్వకపోతే చర్యలు తీసుకుంటామని నోటీసులో హెచ్చరించడం గమనార్హం. అయితే ఈ స్థానంలో కొన్ని సామాజిక వర్గాల ఓట్లు చీల్చేందుకు కాంగ్రెస్ అభ్యర్థి, భారాస అభ్యర్థి గంగుల కలిసి పథకం పన్నారంటూ భాజపా అభ్యర్థి బండి సంజయ్ ఫలితాల విడుదల రోజునే ఆరోపించారు.
Assembly Seats: త్వరలో ఏపీ, తెలంగాణలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు!
రాష్ట్రాల అసెంబ్లీ స్థానల పునర్విభజనతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో అసెంబ్లీ స్థానాలు (Telangana Assembly Seats) పెరగవచ్చని తెలుస్తోంది. ఏపీలో 50 (AP Assembly Seats), తెలంగాణ(Telangana)లో 34 కొత్త అసెంబ్లీ స్థానాలు ఏర్పాటు కానున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే ఇది…