క‌రీంన‌గ‌ర్ కాంగ్రెస్ అభ్య‌ర్థికి పార్టీ షాక్‌..!

మన ఈనాడు:తెలంగాణలో జ‌రిగిన సాధార‌ణ ఎన్నిక‌ల్లో క‌రీంన‌గ‌ర్ నుంచి కాంగ్రెస్ త‌ర‌ఫున పోటీ చేసిన అభ్య‌ర్థి పురుమ‌ళ్ల శ్రీనివాస్ కు ఆ పార్టీ షాకిచ్చింది. గ‌త ఎన్నిక‌ల్లో భార‌తీయ రాష్ట్ర స‌మితి అభ్య‌ర్థి గంగుల క‌మ‌లాక‌ర్ తో కుమ్మ‌క్కై పార్టీ ఓడిపోయేలా చేశారంటూ పార్టీ క్ర‌మ‌శిక్ష‌ణ క‌మిటీ శుక్ర‌వారం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఈ ఎన్నిక‌ల ప్ర‌చారంలో పార్టీ అందించిన నిధుల‌ను ఖ‌ర్చు చేయ‌క‌పోవ‌డంతో పాటు భారాస, భాజ‌పా అభ్య‌ర్థుల‌కు స‌హ‌కారం అందించార‌ని.. ప్ర‌చారానికి ఇత‌ర రాష్ట్రాల ప్ర‌తినిధులు, ఏఐసీసీ ప్ర‌ముఖులు వ‌చ్చిన‌ప్పుడు కాంగ్రెస్ పార్టీ కార్య‌క‌ర్త‌ల‌కు క‌నీస స‌మాచారం అందించ‌లేద‌ని పేర్కొంటూ క్ర‌మ‌శిక్ష‌ణ క‌మిటీ ఛైర్మ‌న్ చిన్నారెడ్డి నోటీసుల్లో పేర్కొన్నారు. దీనిపై మూడు రోజుల్లో లిఖిత పూర్వక వివ‌ర‌ణ ఇవ్వ‌క‌పోతే చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని నోటీసులో హెచ్చ‌రించ‌డం గ‌మ‌నార్హం. అయితే ఈ స్థానంలో కొన్ని సామాజిక వ‌ర్గాల ఓట్లు చీల్చేందుకు కాంగ్రెస్ అభ్య‌ర్థి, భారాస అభ్య‌ర్థి గంగుల క‌లిసి ప‌థ‌కం ప‌న్నారంటూ భాజ‌పా అభ్య‌ర్థి బండి సంజ‌య్ ఫ‌లితాల విడుద‌ల రోజునే ఆరోపించారు.

Related Posts

SC Classification Bill: ఎస్సీ వర్గీకరణ బిల్లుకు అసెంబ్లీ గ్రీన్‌సిగ్నల్

తెలంగాణ అసెంబ్లీ(Telagana Assembly) మరో ప్రతిష్ఠాత్మక బిల్లుకు ఆమోదం తెలిపింది. ఎస్సీ వర్గీకరణ బిల్లు(SC Classification Bill)కు గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్రంలోని 59 SC కులాలను 3 గ్రూపులుగా వర్గీకరిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt) సభలో బిల్లును ప్రవేశపెట్టింది. ఈమేరకు…

TG Assembly: రుణమాఫీపై వాదోపవాదనలు.. సభ నుంచి BRS వాకౌట్

మూడో రోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు (Assembly Sessions) వాడీవేడిగా కొనసాగుతున్నాయి. అసెంబ్లీలో గవర్నర్ (Governor) ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ కొనసాగుతుండగా.. రైతు రుణమాఫీ, గృహజ్యోతి పథకాలపై అధికార, విపక్ష నేతలు వాదోపవాదనలు చేసుకున్నారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ సభ్యులు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *