తెలంగాణ అసెంబ్లీ స్పీకర్​గా గడ్డం ప్రసాద్​కుమార్​

మన ఈనాడు: తెలంగాణ అసెంబ్లీ రెండవ స్పీకర్​గా వికారాబాద్​ కాంగ్రెస్​ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్​కుమార్​ కాంగ్రెస్​ అధిష్టానం నియమించడానికి నిర్ణయం తీసుకుంది. స్పీకర్​గా ఆయన పేరును మంత్రులు పేర్లుతోపాటు ఆయన పేరును అధికారికంగా ప్రకటించింది. సభ నిర్వాహణ కీలకంగా మారడంతో దళత సామాజిక వర్గానికి చెందిన గడ్డం ప్రసాద్​కుమార్​ స్పీకర్​గా అన్ని రకాలుగా అర్హుడిగా ఉంటాడని భావించింది.

వికారాబాద్​ జిల్లా మర్పల్లి గ్రామంలో 1964 సంవత్సరంలో గడ్డం ప్రసాద్​ జన్మించారు తాండూరు ప్రభుత్వ కాలేజీలో ఇంటర్​ పూర్తి చేశారు. 2008లో జరిగిన బై ఎలక్షన్స్​లో కాంగ్రెస్​ అభ్యర్థిగా పోటీ చేసి అప్పటి టీఆర్​ఎస్​ పై విజయం సాధించారు. మళ్లీ 2009లో జరిగిన ఎన్నికల్లోనూ టీఆర్​ఎస్​పై గెలిచారు. ఆతర్వాత వైఎస్​ క్యాబినెట్​చోటు దక్కించుకున్నారు. చేనేత, పరిశ్రమల శాఖ మంత్రిగా పనిచేశారు. 2014,2018లో జరిగిన ఎన్నికల్లో ఇప్పటి బీఆర్​ఎస్​ అభ్యర్థి మెతుకు ఆనంద్​పై ఓటమి చెందారు.

మూడుసార్లు ఎమ్మెల్యేతోపాటు మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. ఈనేపథ్యంలో అన్ని విధాలుగా అసెంబ్లీ స్పీకర్​గా సభను నడిపించడానికి అవకాశాలు ఉన్నాయని కాంగ్రెస్​ పెద్దలు భావించారు.తెలంగాణ రాష్ట్రంలో తొలి దళిత స్పీకర్​గా గడ్డం ప్రసాద్​కే అవకాశం పొందనున్నారు.

 

Related Posts

BJP: ఉత్కంఠకు తెర.. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి పేరు ఖరారు!

తెలంగాణ బీజేపీ (BJP) అధ్యక్షుడిని ఆ పార్టీ అధిష్ఠానం ఖరారు చేస్తూ కొంతకాలంగా ఉత్కంఠ రేపుతున్న ఈ అంశానికి తెరదింపింది. పార్టీ విధేయుడు, మాజీ ఎమ్మెల్సీ రామచందర్‌రావు (Ramachander Rao) పేరును అధిష్ఠానం దాదాపు ఖరారు చేసింది. ఈ మేరకు నామినేషన్‌…

BJP: రథసారధి ఎవరు? తెలంగాణలో బీజేపీ అధ్యక్షుడి ఎంపికపై వీడని సస్పెన్స్!

తెలంగాణ(Telangana)లో బీజేపీ(BJP) సారథి ఎవరనే దానిపై సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. మొన్నటి వరకూ ఎంపీలు ధర్మపురి అర్వింద్, ఈటల రాజేందర్(Etala Rajender), రఘునందన్‌రావు మధ్య గట్టి పోటీ ఉందని ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. ఇప్పుడు మాజీ MLC రామచంద్రారావు పేరు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *