మన ఈనాడు: తెలంగాణ అసెంబ్లీ రెండవ స్పీకర్గా వికారాబాద్ కాంగ్రెస్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్కుమార్ కాంగ్రెస్ అధిష్టానం నియమించడానికి నిర్ణయం తీసుకుంది. స్పీకర్గా ఆయన పేరును మంత్రులు పేర్లుతోపాటు ఆయన పేరును అధికారికంగా ప్రకటించింది. సభ నిర్వాహణ కీలకంగా మారడంతో దళత సామాజిక వర్గానికి చెందిన గడ్డం ప్రసాద్కుమార్ స్పీకర్గా అన్ని రకాలుగా అర్హుడిగా ఉంటాడని భావించింది.
వికారాబాద్ జిల్లా మర్పల్లి గ్రామంలో 1964 సంవత్సరంలో గడ్డం ప్రసాద్ జన్మించారు తాండూరు ప్రభుత్వ కాలేజీలో ఇంటర్ పూర్తి చేశారు. 2008లో జరిగిన బై ఎలక్షన్స్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి అప్పటి టీఆర్ఎస్ పై విజయం సాధించారు. మళ్లీ 2009లో జరిగిన ఎన్నికల్లోనూ టీఆర్ఎస్పై గెలిచారు. ఆతర్వాత వైఎస్ క్యాబినెట్చోటు దక్కించుకున్నారు. చేనేత, పరిశ్రమల శాఖ మంత్రిగా పనిచేశారు. 2014,2018లో జరిగిన ఎన్నికల్లో ఇప్పటి బీఆర్ఎస్ అభ్యర్థి మెతుకు ఆనంద్పై ఓటమి చెందారు.
మూడుసార్లు ఎమ్మెల్యేతోపాటు మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. ఈనేపథ్యంలో అన్ని విధాలుగా అసెంబ్లీ స్పీకర్గా సభను నడిపించడానికి అవకాశాలు ఉన్నాయని కాంగ్రెస్ పెద్దలు భావించారు.తెలంగాణ రాష్ట్రంలో తొలి దళిత స్పీకర్గా గడ్డం ప్రసాద్కే అవకాశం పొందనున్నారు.