TG| రెండు గంటలు అదనంగా పనిచేస్తాం..బాధ్యత తీసుకుంటా: సీఎం

Mana Enadu: బీజేపీ కోసం బీఆర్ఎస్ నాయకులు అవయవదానం చేశారు. బీజేపీ గెలుపుకోసం బీఆర్ఎస్ నాయకులు ఎంతో కృషి చేశారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఆత్మ బలిదానం చేసుకుందని సీఎం రేవంత్ రెడ్డి (CM Reventh Reddy)విమ‌ర్శించారు.

ఏడు నియోజక వర్గాల్లో బీఆర్ఎస్ డిపాజిట్ కోల్పోయింది. పార్టీ పెట్టినప్పటి నుండి బీఆర్ఎస్ పార్టీకి సిద్దిపేటలో మెజారిటీ వచ్చింది. సిద్దిపేటలో హరీష్ రావు(HarishRao)కి పూర్తి పట్టున్నప్పటికీ తమ ఓట్లు బీజేపీకి వేయించారు. బీఆర్ఎస్ చేసిన కుట్రతోనే కాంగ్రెస్(Congress) ఎనిమిది చోట్ల ఓడిపోడిందని రేవంత్ అన్నారు.

మోదీ గ్యారంటీకిఉన్న వారంటీ అయిపోయింది. మోదీ.. కాలం చెల్లిపోయింది. మోదీ చరిష్మా తో ఎన్నికలకు వెళ్లిన ఎన్డీయే కూటమికి ప్రజలు బుద్ధి చెప్పారు. ప్రజలు తిరస్కరించిన మోదీ తక్షణమే రాజీనామా చేయాలి. మోదీకి విలువలు ఉంటే ప్రధాని పదవి నుండి హుందాగా తప్పుకోవాలని రేవంత్ అన్నారు.

ఈరోజు నుండి మరో రెండు గంటలు అదనంగా పని చేస్తాం. రాష్ట్రంలో ఏ సీటు గెలిచినా, ఏ సీటు ఓడినా నాదే బాధ్యత. గెలుపు ఓటములు నేనే బాధ్యత తీసుకుంటా. మాకు వచ్చిన ఫలితాలు ఉగాది పచ్చడి లాగా ఉన్నాయి. వాటిని స్వీకరిస్తున్నాను. కేసీఆర్ బీజేపీతో బేరసారాలు చేసుకుంటున్నాడు. ఆత్మ ప్రబోధానుసారం బీఆర్ఎస్ నాయకులు నిర్ణయాలు తీసుకోవాలని రేవంత్ సూచించారు.

కేసీఆర్ రాజకీయ జాదుగాడు. కేసీఆర్ రాజకీయాల్లో ఉన్నన్ని రోజులు ఇలాంటి కుట్రలు చేస్తూనే ఉంటాడు. ప్రపంచంలోనే అత్యంత అవినీతి పరుడు కేసీఆర్, ఆయనతో బీజేపీ స్నేహం ఎలా చేస్తోందంటూ రేవంత్ ప్రశ్నించారు. ఏపీలో ప్రభుత్వంతో సఖ్యతగా ఉంటాం. ఏపీతో ఉన్న ఆస్తులు, నీటి పంపకాలను చర్చించి పరిష్కరించుకుంటామ‌ని రేవంత్ పేర్కొన్నారు.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *