T BJP| తెలంగాణ బీజేపీ ఖాతాలో 12స్థానాలు: ఈటెల కామెంట్స్​

Mana Enadu: ప్రధాని నరేంద్రమోదీని మరోసారి ప్రధానిని చేయాలనే కాంక్షతో అన్ని వర్గాల ప్రజలు ఈ ఎన్నికలలో ఉత్సాహంగా ఉన్నారని మల్కాజ్​గిరి బీజేపీ పార్లమెంట్​ అభ్యర్థి ఈటెల రాజేందర్​ అన్నారు.

తెలంగాణ మొత్తంగా బీజేపీ చాలా శక్తివంతంగా ఉంది. సర్వేసంస్థలకు అందని, ఊహించని విధంగా ఈ జూన్ 4వ తేదీన గొప్ప అద్భుతం జరగబోతోందన్నారు. నాంపల్లి బీజేపీ కార్యాలయంలో మంగళవారం ఈటల రాజేందర్ ప్రెస్‌మీట్​ నిర్వహించారు.బీజేపీ పార్టీ అఖండ విజయం సాధించబోతోందని పేర్కొన్నారు.

ప్రజల తీర్పు నిక్షిప్తంగా ఉంది. పదేళ్ల క్రితం కాంగ్రెస్ పార్టీ ఎలాంటి నీచమైన మాటలు చెప్పిందో అవే మాటలు మళ్లీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా చెప్తున్నాడని విమర్శలు చేశారు.

నేడు ప్రధాని మోదీ పదేళ్ల పాలనలో దేశం ఎంతో అభివృద్ధి చెందింది. ఎక్కడా బాంబుల పేలుళ్లు లేవు. అందరూ ప్రశాంతంగా జీవిస్తున్నారు.

మేము ప్రచారం నిమిత్తం ఏ ఇంటికి పోయినా సాదరంగా ఆహ్వానించి బీజేపీకే ఓటు వేస్తామంటున్నారు.

తెలంగాణలో ఖచ్చింతంగా అమిత్‌షా చెప్పినట్లు 12 ఎంపీ స్థానాలను గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. రేపటి భవిష్యత్తు తెలంగాణలో బీజేపీదే అన్నారు.

రాష్ట్రమేలు కోసం బీజేపీ ఎంపీగా పార్టీ ఇచ్చిన మేనిఫెస్టోను ఖచ్చితంగా అమలు చేస్తానని హామీ ఇస్తుందన్నారు.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *