Mana Enadu|తెలంగాణ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు, కేంద్రమంత్రి జి. కిషన్ రెడ్డి రాష్ట్రప్రభుత్వంపై కీలక వ్యాఖ్యలు చేశారు. మహాలక్ష్మి పథకం కింద ఆర్టీసీకి చెల్లించాల్సిన బకాయిలు చెల్లించట్లేదని కిషన్ రెడ్డి ఆరోపించారు.
ఇచ్చిన ఏ హామీని కాంగ్రెస్ అమలు చేయట్లేదని పేర్కొన్నారు. పెళ్లి చేసుకుంటే తులం బంగారం ఇస్తమన్నారు.. ఎవరికీ ఇచ్చారు? అని ప్రశ్నించారు. ఇప్పటికైనా సిఎం రేవంత్ రెడ్డి అబద్ధాలు మానుకోవాలని హెచ్చరించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు ప్రత్యామ్నాయం బీజేపినే అని ఆయన స్పష్టం చేశారు. ఇచ్చిన హామీలపై అడుగడుగునా కాంగ్రెస్ ను నిలదీస్తామని కిషన్ రెడ్డి తెలిపారు. తెలంగాణ ఆర్థిక వ్యవస్థ గడ్డుకాలంలో ఉందని ఆయన పేర్కొన్నారు.