CM Reventh: గల్ఫ్ కార్మికులకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్

ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్తున్న తెలంగాణ కార్మికులకు సీఎంరేవంత్ రెడ్డి గుడ్​ న్యూస్​ ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త విధానం తీసుకురానున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు.

తెలంగాణ గల్ఫ్, ఓవర్సీస్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డును ఏర్పాటు చేసి ఇందులో ఓ ఐఏఎస్ అధికారితో పాటు సిబ్బందిని నియమిస్తామన్నారు. సెప్టెంబర్ 17 లోపు ఈ వ్యవస్థను పకడ్బందీగా ఏర్పాటు చేసే బాధ్యత నేను తీసుకుంటానని భరోసా ఇచ్చారు. తాజ్ డెక్కన్ లో గల్ఫ్ కార్మిక సంఘాల నేతలతో సీఎం రేవంత్ రెడ్డి (CM Reventh Reddy)సమావేశం అయ్యారు.

రాష్ట్రంలో 15 లక్షల కుటుంబాలు గల్ఫ్ ఉపాధిపై ఆధారపడి ఉన్నాయని.. ఉపాధి నిమిత్తం విదేశాలకు వెళ్లి ఇబ్బందులు పడుతున్న వారి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం(Telangana Government) ప్రత్యేక శ్రద్ధ తీసుకుందన్నారు.

వారి పిల్లల చదువుల కోసం రెసిడెన్సియల్ స్కూళ్ల ఏర్పాటు కోసం ఆలోచన చేస్తోందన్నారు. అయితే ఈ అంశం రాష్ట్ర పరిధితో పాటు కేంద్ర పరిధిలోని అంశం అని అందువల్ల జాతీయ స్థాయిలో మీ ప్రతినిధులు ఉండాలని అందువల్ల పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు.

ఓవర్సీస్ కార్మికుల కోసం ఫిలిప్పీన్, కేరళ(Kerala)లో మంచి విధానం ఉందని ఈ విషయంలో ఇతర దేశాలు, రాష్ట్రాలు అవలంభిస్తున్న విధానంపై అధ్యయనం చేస్తున్నామన్నారు. అన్నీ అధ్యయనం చేసి తెలంగాణ ప్రభుత్వం కూడా సమగ్ర విధానం రూపొందిస్తామన్నారు. గల్ఫ్ కార్మికులకు చనిపోతే రూ.5 లక్షలు ఇవ్వాలని ఇప్పటికే నిర్ణయించామని రాబోయే రోజుల్లో రైతు బీమా ఉన్నట్లుగానే గల్ఫ్ కార్మికులకు బీమా సౌకర్యం ఏర్పాటు ఆలోచన చేస్తున్నామన్నారు.

ఏ దేశంలోనైనా తెలంగాణ బిడ్డలు ఇబ్బందుల్లో ఉంటే వారు రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదించేలా టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేస్తామన్నారు. విదేశాల్లో కాయకష్టం చేసి రూపాయి రూపాయి కూడబెట్టుకుని ఇక్కడ ఏదైనా ఆస్తులు కొనుకుంటే అలాంటి ఆస్తులు వివాదాల్లో చిక్కుకుంటున్నాయని అలాంటి ప్రాపర్టీకి రక్షణ కల్పించేలా చర్యలు తీసుకుంటామన్నారు. కొన్ని కుటుంబాల్లోని వారు విదేశాలకు వెళ్తే ఇక్కడ ఉండే వారి తల్లిదండ్రుల ఆరోగ్యం చూసుకునే వారు ఉండరని అందువల్ల విదేశాలకు వెళ్లిన వారి ఆరోగ్యంతో పాటు ఇక్కడ ఉన్న వారి పేరెంట్స్ ఆరోగ్యం, ఇతర సహాయం అందించేలా వారి వివరాలు కూడా ప్రభుత్వం నమోదు చేసుకునేలా ఆలోచన చేస్తున్నామన్నారు.

Related Posts

Assembly Seats: త్వరలో ఏపీ, తెలంగాణలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు!

రాష్ట్రాల అసెంబ్లీ స్థానల పునర్విభజనతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో అసెంబ్లీ స్థానాలు (Telangana Assembly Seats) పెరగవచ్చని తెలుస్తోంది. ఏపీలో 50 (AP Assembly Seats), తెలంగాణ(Telangana)లో 34 కొత్త అసెంబ్లీ స్థానాలు ఏర్పాటు కానున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే ఇది…

గన్నవరం చేరుకున్న ప్రధాని.. కాసేపట్లో అమరావతికి మోదీ

అమరావతి పునరుద్ధరణ పనుల(For Amaravati renovation works)కు శ్రీకారం చుట్టేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(PM Modi) గన్నవరం విమానాశ్రయాని( Gannavaram Airport)కి చేరుకున్నారు. ఆయనకు ఏపీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు, మంత్రులు అనిత, అనగాని, వాసంశెట్టి స్వాగతం పలికారు.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *