రంగారెడ్డిలో ఘోర ప్రమాదం – బస్సు, కారు ఢీ – ముగ్గురు మృతి

Road Accident at Rangareddy : రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆమనగల్లు మండలం రాంనుంతల గ్రామ శివారులోని హైదరాబాద్​ – శ్రీశైలం జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సు, కారు ఢీ కొన్నాయి. ఈ ఘటనలో ప్రమాదానికి గురైన కారు కల్వకుర్తి నుంచి హైదరాబాద్​ వెళ్తుంది. ఇందులో ఉన్న ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు.
 పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతులు శివకృష్ణ వరప్రసాద్ గౌడ్ (35), నిఖిల్ (26), మణిదీప్ (25)లను హైదరాబాద్​లోని కర్మన్​ఘాట్​ వాసులుగా గుర్తించారు. కారులో చిక్కుకున్న మృతదేహాలను జేసీబీ సాయంతో వెలికి తీసి పోస్టుమార్టం నిమిత్తం కల్వకుర్తి ప్రభుత్వ అస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఘటనకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *