పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీకి వరుసగా షాక్లు తగులుతున్నాయి. హుజూర్నగర్ మాజీ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి తాజాగా బీజేపీలోకి చేరనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈయనను బీజేపీ నుంచి నల్గొండ పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
EX MLA Saidi Reddy తాజాగా బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి బీజేపీలోకి చేరనున్నట్లు తెలుస్తుంది. అయితే ఈయనను బీజేపీ నుంచి నల్గొండ పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే బీజేపీ ఖమ్మం, నల్గొండ, మహబూబ్నగర్ నియోజకవర్గాలపై ఫోకస్ పెట్టింది.
అయితే ఖమ్మం నుంచి కూడా మరో సీనియర్ బీఆర్ఎస్ నేతను చేర్చుకునేలా బీజేపీ ప్రణాళికలు చేస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా.. జహీరాబాద్ బీఆర్ఎస్ ఎంపీ బీబీ పాటిల్ కూడా ఆ పార్టీకి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ కు (KCR) పంపారు. తాజాగా ఆయన తరుణ్ చుగ్ సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు. నిన్న (గురువారం) బీఆర్ఎస్ నాగర్ కర్నూల్ ఎంపీ రాములు బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. వరుస నేతల రాజీనామాలతో బీఆర్ఎస్ పార్టీ మెల్లగా ఖాళీ అవుతోంది. ఇటీవల మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డితో కుటుంబ సమేతంగా కాంగ్రెస్ లో చేరారు. ఆయనతో పాటు హైదరాబాద్ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, మాజీ డిప్యూటీ తదితర బీఆర్ఎస్ పార్టీ నేతలు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిపోయారు.