రాంకీ సంస్థ నిర్లక్ష్యం.. చెత్త సేకరించిన ఆటోల అన్‌లోడింగ్‌లో సమస్యలు

ManaEnadu:అసలే వర్షాకాలం (Monsoon). మొన్నటిదాక భారీ వర్షాలు, వరదలు. ఇప్పటికే దోమలు, ఈగలతో జనం సతమతమవుతున్నారు. సీజనల్ వ్యాధులు (Seasonal DIseases) చుట్టుముట్టేసి ఇంటిళ్లిపాది ఆస్పత్రులకే పరిమితమవుతున్నారు. ఇప్పటికే జ్వరాలతో బాధపడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇంటినిండా చెత్త ఉంటే ఇంకెన్ని వ్యాధులు చుట్టుముట్టుతాయో చెప్పనక్కర్లేదు. అయితే ప్రస్తుతం హైదరాబాద్‌ మహానగరంలో చాలా ప్రాంతాలను ఈ చెత్త సమస్య ఇబ్బంది పెడుతోంది. ఇంతకీ ఏం జరిగిందంటే?

లోడింగ్ ఓకే.. అన్‌లోడింగ్ ఏది?

ప్రతిరోజులానే నగరం(Hyderabad)లో చెత్తను సేకరించేందుకు జీహెచ్‌ఎంసీ సిబ్బంది ఇళ్లకు వస్తున్నారు. చెత్త లోడ్ చేసుకుని ఆటోల్లో వెళ్తున్నారు. అయితే ఈ చెత్తను అన్‌లోడింగ్ చేయడంలో ఇప్పుడు తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. రాంకీ సంస్థ (Ramky Group) ఆటోల నుంచి చెత్తను అన్‌లోడింగ్ చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నట్లు తెలిసింది. చెత్తను అన్‌లోడ్ చేసేందుకు సరిపడా డబ్బాలు కేటాయించకపోవడంతో సేకరించిన చెత్త అంతా ఆటోల్లోనే ఉంటోంది.

డబ్బాల్లేవ్..

దీనివల్ల మరింత చెత్త సేకరణకు ఆటోలు (GHMC Autos) కరవైపోయాయి. దీంతో ఇంటింటికి వెళ్లి చెత్త సేకరణకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. చెత్తను తీసుకెళ్లేందుకు జీహెచ్ఎంసీ సిబ్బంది రాకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వారంపాటు చెత్త అంతా ఇంట్లోనే ఉండటంతో దోమలు, ఈగలతో వ్యాధుల బారిన పడుతున్నామంటూ వాపోతున్నారు.

రాంకీ సంస్థ నిర్లక్ష్యం..

మరోవైపు రాంకీ సంస్థ చెత్త అన్‌లోడింగ్‌కు డబ్బాలు కేటాయించకపోవడం వల్లే ఈ సమస్యలు ఎదురవుతున్నాయని జీహెచ్ఎంసీ ఆటో కార్మికులు వాపోతున్నారు. మొత్తం 364 ఆటోలు అన్‌లోడింగ్‌కు రెడీ ఉన్నాయని, ఒక్కో వాహనంలో దాదాపు 2 టన్నలు చెత్త ఉందని చెబుతున్నారు. ఆ సంస్థ చెత్తడబ్బాలు కేటాయించకపోతే చెత్త సేకరణకు మరింత ఇబ్బంది ఎదురువుతుందని, దానివల్ల ప్రజలకు అవస్థలు తప్పవని అంటున్నారు. వీలైనంత త్వరగా ఆ సంస్థ నిర్లక్ష్యం వీడి చెత్త డబ్బాలు కేటాయించాలని కార్మికులు కోరుతున్నారు.

Related Posts

Fish Venkat: టాలీవుడ్‌లో విషాదం.. ప్రముఖ నటుడు ఫిష్ వెంకట్ కన్నుమూత

తెలుగు సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. ప్రముఖ హాస్యనటుడు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఫిష్ వెంకట్ (Fish Venkat) శుక్రవారం (జులై 18) రాత్రి కన్నుమూశారు. 53 ఏళ్ల ఆయన అసలు పేరు మంగిలంపల్లి వెంకటేశ్. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యం(serious illness)తో…

IBPS PO 2025 Notification: డిగ్రీ అర్హతతో IBPSలో భారీ నోటిఫికేషన్.. 5,208 పోస్టులు భర్తీ! ఇలా అప్లై చేయండి!

ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) మరియు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) తాజాగా రెండు కీలక నోటిఫికేషన్ల( Notifications)ను విడుదల చేశాయి. బ్యాంకింగ్, ఇంజనీరింగ్ రంగాల్లో ఉద్యోగాలు కోరుకునే అభ్యర్థులకు ఇది ఒక గొప్ప అవకాశం. IBPS PO/MT…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *