Hydra Report : 262 అక్రమ నిర్మాణాల కూల్చివేత.. 111.72 ఎకరాల భూమి స్వాధీనం

ManaEnadu:హైదరాబాద్​లో అన్యాక్రాంతమైన ప్రభుత్వ భూములను (Govt Lands), చెరువులను పరిరక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం హైడ్రాను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. హైడ్రా కమిషనర్​గా రంగనాథ్ బాధ్యతలు స్వీకరించిన మరుక్షణం నుంచి దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వ భూముల పరిరక్షణే ధ్యేయంగా రంగంలోకి దిగిన హైడ్రా (HYDRA).. ఆక్రమణదారుల గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తోంది.

111.72 ఎకరాల భూమి స్వాధీనం
హైడ్రా ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటి వరకు వంద ఎకరాలకుపైగా స్థలాన్ని స్వాధీనం చేసుకుంది. వందల అక్రమ నిర్మాణాల (Illegal Constructions)ను కూల్చివేసింది. ఈ నేపథ్యంలో తాజాగా హైడ్రా రాష్ట్ర ప్రభుత్వానికి మోర నివేదిక అందజేయసింది. ఈ నివేదిక ప్రకారం జీహెచ్‌ఎంసీ పరిధిలో మొత్తం 23 ప్రాంతాల్లో 262 అక్రమ నిర్మాణాలను కూల్చివేసి 111.72 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకున్నట్లు హైడ్రా తెలిపింది.

ఆక్రమణదారులకు హడల్
గత రెండు నెలలుగా చెరువులు, ఎఫ్‌టీఎల్‌ (FTL), బఫర్‌ జోన్ల (Buffer Zones)లో అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్న హైడ్రా.. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న నిర్మాణాలను ఎక్కడా ఉపేక్షించకుండా నేలమట్టం చేస్తూ ఆక్రమణదారులకు నిద్రలేకుండా చేస్తోంది. రాబోయే రోజుల్లో హైడ్రా చర్యలు మరింత వేగవంతం కానున్నాయి.

అత్యధికంగా అమీన్​పూర్​లో
ముఖ్యంగా నగరంలోని రామ్‌నగర్‌ మణెమ్మ గల్లీలో 3, గగన్‌ పహాడ్‌ అప్పా చెరువులో 14, అమీన్‌పూర్‌ పెద్ద చెరువు పరిధిలో 24, మాదాపూర్‌ సున్నం చెరువులో 42, దుండిగల్‌ కత్వా చెరువు పరిధిలో 13 అక్రమ నిర్మాణాలను తొలగించింది. అత్యధికంగా అమీన్‌పూర్‌లో 51 ఎకరాలు, మాదాపూర్‌ సున్నం చెరువు పరిధిలో 10 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని స్వాధీనం చేసుకున్నట్లు రిపోర్టులో హైడ్రా (Hydra Latest Report) పేర్కొంది.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *