Vishwambhara:ఎవరూ టచ్ చేయని సబ్జెక్ట్​తో ‘విశ్వంభర’.. మూవీపై హైప్ పెంచేసిన డైరెక్టర్ వశిష్ఠ

ManaEnadu:సెకండ్ ఇన్నింగ్స్​లో మెగాస్టార్ చిరంజీవి కాస్త నెమ్మదిగా సినిమాలు చేస్తున్నాడు. ఆచితూచి చేస్తున్నా.. ఆచార్య, ‘భోళాశంకర్’ వంటి డిజాస్టర్లు మూటగట్టుకోవాల్సి వస్తోంది. ఈ రెండు డిజాస్టర్ల​​ తర్వాత మెగాస్టార్​​​ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్​​ మూవీ ‘విశ్వంభర’. సోషియో ఫాంటసీగా ఈ సినిమాను బింబిసార డైరెక్టర్ వశిష్ఠ తెరకెక్కిస్తున్నారు. చిరు కెరీర్​లోనే అత్యంత భారీ బడ్జెట్​తో రూపొందుతున్న ఈ సినిమా నుంచి ఇవాళ చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా దర్శకుడు ఓ క్రేజీ న్యూస్ చెప్పారు.

మెగాస్టార్ బర్త్ డే సందర్భంగా ఇవాళ విశ్వంభర టీజర్ వస్తుందని అందరూ ఊహించినా.. కేవలం పోస్టర్​తోనే సరిపెట్టుకుంది చిత్రబృందం. అయితే మెగాస్టార్​కు స్పెషల్​గా పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పిన ఈ సినిమా డైరెక్టర్ వశిష్ఠ.. పోస్టర్​ మాత్రమే రిలీజ్ చేసినా.. ఈ మూవీపై సూపర్ హైప్ క్రియేట్ చేసే న్యూస్ ఒకటి షేర్ చేసుకున్నారు. ఇంతకీ అదేంటంటే?

“విశ్వంభర.. మెగాస్టార్ నటిస్తున్న ఈ చిత్రంపై ఎన్ని అంచనాలైనా పెట్టుకోండి. మీ అంచనాలకు మించే ఈ సినిమా ఉంటుందని నేను మాటిస్తున్నా. చిరంజీవి అభిమానులంతా కాలర్ ఎగరేసేలా, ఓ సగటు చిరు అభిమానిగా నేను ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాను. బాస్​ను అంతా ఎలా చూడాలని అనుకుంటున్నారో అలా చూపిస్తాను. ఒకప్పటి వింటేజ్ చిరును చూపిస్తూనే.. మెగాస్టార్​తో ఇప్పటి వరకు ఎవరూ చేయని సబ్జెక్ట్​తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాను. ప్రతి మెగా అభిమాని మనసు హత్తుకునేలా ఈ సినిమా ఉంటుంది. టీజర్ అనౌన్స్​మెంట్ త్వరలోనే ఉంటుంది. అప్పుడు చూస్తారుగా ఈ సినిమా ఏ రేంజ్​లో ఉండబోతోందో?”.. అంటూ వశిష్ఠ ఈ చిత్రంపై భారీగా అంచనాలు క్రియేట్ చేశాడు.

విశ్వంభర సినిమా వచ్చే ఏడాది జనవరి 10న రిలీజ్ కానుంది. ఈ సంక్రాంతి మనదేనంటూ వశిష్ఠ తాజాగా మరోసారి నొక్కి వక్కానించారు. సంక్రాంతి విన్నర్ విశ్వంభర అని తెలిపారు. ఈ సినిమాలో చిరుకు జోడీగా త్రిష నటిస్తోంది. స్టాలిన్ తర్వాత ఈ జంట మరోసారి కలిసి పని చేస్తోంది. ఇక ఆమెతో పాటు అశికా రంగనాథ్, మరో ముగ్గురు హీరోయిన్లు కూడా ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *