ప్రభాస్‌పై అర్షద్‌ వార్సీ కామెంట్స్.. ఫ్యాన్స్​ను హర్ట్ చేశారంటూ ‘మా’ లేఖ

ManaEnadu:‘కల్కి 2898 ఏడీ’ సినిమాలో ప్రభాస్‌ పాత్ర జోకర్​లా ఉందంటూ బాలీవుడ్‌ నటుడు అర్షద్‌ వార్సీ చేసిన కామెంట్స్ పెను దుమారం రేపుతున్నాయి. ఈ వ్యవహారంపై ఇప్పటికే పలువురు హీరోలు, ఇతర ప్రముఖులు స్పందించారు. వార్సి వ్యాఖ్యలను తప్పుబట్టారు. ప్రభాస్ స్టార్​డమ్ తెలియకుండా మాట్లాడారంటూ ఫైర్ అయ్యారు. తాజాగా ఈ వ్యవహారంపై మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ (మా) అధ్యక్షుడు మంచు విష్ణు.. మూవీ అండ్‌ టీవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ (CINETAA)కు లేఖ రాశారు. అర్షద్ వార్సీ ప్రభాస్​పై చేసిన కామెంట్స్.. టాలీవుడ్‌ నటులు, అభిమానుల మనోభావాల్ని దెబ్బతీసేలా ఉన్నాయని CINETAA అధ్యక్షురాలు పూనమ్‌ ధిల్లాన్‌కు రాసిన లేఖలో మంచు విష్ణు పేర్కొన్నారు.

“ప్రతి వ్యక్తికి వారి అభిప్రాయాలను వ్యక్తపరిచే హక్కు ఉంది. దాన్ని మేమూ గౌరవిస్తున్నాం. కానీ, అర్షద్‌ వార్సీ చేసిన కామెంట్స్ ప్రభాస్​ను తక్కువ చేసేలా ఉన్నాయి. ఆయన అలా మాట్లాడినందుకు మేం చాలా బాధపడుతున్నాం. సోషల్ మీడియా యుగంలో ఇలాంటి కామెంట్స్ ఎక్కువ వైరల్ అవుతాయి. ఈ విషయాన్ని అందరూ గమనించాలి. దయచేసి సెలబ్రిటీలు మాట్లాడేటప్పుడు కాస్త జాగ్రత్తపడాలి. మాటకు చాలా పవర్ ఉంటుంది. అది ఇద్దరి మధ్య బంధాలను బలపరచగలదు, గొడవలూ పెట్టగలదు.”

“అర్షద్‌ కామెంట్స్‌ నెగెటివిటీని తీసుకొచ్చేలా ఉన్నాయి. నటుల మధ్య యూనిటీ, గౌరవం కోసం ఎప్పుడూ ముందుండే CINETAA అర్షద్‌ వార్సీ కామెంట్స్​పై స్పందిస్తుందని భావిస్తున్నాం. మీ సమాధానం కోసం ఎదురుచూస్తున్నాం. భవిష్యత్తులో ఇలాంటి కామెంట్స్‌ చేయకుండా ఆయనకు సూచనలు చేస్తారని ఆశిస్తున్నాం. ప్రాంతాలతో, భాషతో సంబంధం లేకుండా అందరూగౌరవంగా ఉండాలని కోరుతున్నాం. మనమంతా ఒకే కుటుంబంలో భాగమని అందరూ గుర్తుంచుకోవాలి. కలిసికట్టుగా ఉందాం. ఈ యూనిటీ కాపాడుకుందాం.” అని మంచు విష్ణు CINETAA అధ్యక్షురాలు పూనమ్‌ ధిల్లాన్‌కు రాసిన లేఖలో పేర్కొన్నారు.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *