రాజకీయాల్లో యువరక్తం ఉంటేనే ప్రజాస్వామ్యానికి బలం.. మన్​ కీ బాత్​లో ప్రధాని మోదీ

ManaEnadu:ప్రతినెల చివరి ఆదివారం రోజున ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశప్రజలతో మనసు విప్పి మాట్లాడే కార్యక్రమం మన్ కీ బాత్. టీవీకే ఆదరణ తగ్గుతున్న సమయంలో రేడియోను ఎంచుకుని ఆకాశవాణి ద్వారా మన్ కీ బాత్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఆగస్టు చివరి ఆదివారమైన నేడు మోదీ ప్రజలతో తన మనుసులోని భావాలు పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆయన వికసిత్ భారత్, రాజకీయాల్లో యువత పాత్ర, భారత అంతరిక్ష అభివృద్ధి, హర్ ఘర్ తిరంగా వంటి కార్యక్రమాలను ప్రస్తావించారు.

అభివృద్ధి చెందిన భారత్‌, బలమైన ప్రజాస్వామ్యం కోసం యువత ప్రజా జీవితంలోకి రావాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. 113వ ‘మన్‌ కీ బాత్‌’ ఎపిసోడ్‌లో మాట్లాడుతూ.. ఎలాంటి నేపథ్యం లేని లక్ష మంది యువత రాజకీయాల్లోకి రావాలి స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఇచ్చిన పిలుపునకు విస్తృత స్పందన వచ్చిందని తెలిపారు. వికసిత్‌ భారత్‌ లక్ష్యం దిశగా దేశాన్ని పటిష్ఠం చేసే ఎన్నో విషయాలు 21వ శతాబ్దంలో జరుగుతున్నాయని పేర్కొన్నారు.

వారసత్వ రాజకీయాలు కొత్త టాలెంట్​ను అణిచివేస్తాయి..

“రాజకీయ నేపథ్యం లేకపోయినా అన్ని వర్గాల ప్రజలు స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్నారు. దేశం కోసం వారు తమని తాము పూర్తిగా అంకితమిచ్చారు. వికసిత్‌ భారత్ లక్ష్యాన్ని సాధించడానికి మనం మరోసారి అదే స్ఫూర్తిని ఫాలో అవ్వాలి. పెద్ద సంఖ్యలో యువత రాజకీయాల్లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారు. వారికి సరైన అవకాశం, మార్గదర్శకత్వం కావాలి. కుటుంబ రాజకీయాలు నూతన ప్రతిభను అణచివేస్తాయి.” అని మోదీ వ్యాఖ్యానించారు.

అంతరిక్ష రంగంలో భారత్​ ప్రతిభ అద్భుతం

అంతరిక్ష రంగంలో భారత్‌ దూసుకెళ్తోందని, చంద్రయాన్‌-3 విజయానికి గుర్తుగా స్పేస్‌ డే నిర్వహించుకున్నామని మోదీ అన్నారు. అంతరిక్ష రంగంలో కృషి చేస్తున్న పలువురు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలతో మోదీ ముచ్చటించారు. ఈ ఏడాదే తొలి అంతరిక్ష దినోత్సవాన్ని జరుపుకొన్నామని .. ఈ రంగంలో తీసుకొచ్చిన అనేక సంస్కరణలతో యువత పెద్ద ఎత్తున లబ్ధి పొందిందని తెలిపారు. రానున్న కాలంలో యువత అంతరిక్షంలో ప్రయోగాలు చేసే దిశగా పెద్ద ఎత్తున ప్రోత్సహించేందుకు ప్రణాళికలు చేస్తున్నట్లు వెల్లడించారు.

“ఈ ఏడాది ‘హర్‌ ఘర్‌ తిరంగా’ ప్రచారం పెద్ద ఎత్తున చేపట్టామం. ఇళ్లు, దుకాణాలు, కార్యాలయాల వద్ద జాతీయ జెండాలు ఆవిష్కరించాం. స్వాతంత్య్ర దినోత్సవం సామాజిక వేడుకగా మారింది. నా పిలుపు మేరకు దాదాపు ఐదు కోట్లకు పైగా మంది జాతీయ జెండాతో ఫొటోలు దిగి వెబ్‌సైట్లో అప్‌లోడ్‌ చేశారు. దేశంపై భారతీయులంతా తమ భక్తిని చాటుకోవడం చూసి నాకు చాలా ఆనందంగా అనిపించింది.” అని మోదీ మన్​ కీ బాత్​లో మాట్లాడారు.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *