రాహుల్‌ కుట్టిన చెప్పులకు ఫుల్ డిమాండ్.. బ్యాగ్ నిండా డబ్బు ఇచ్చినా ‘నాట్ ఫర్ సేల్’

Mana Enadu: కాంగ్రెస్ ఎంపీ, లోక్​సభ ప్రతిపక్ష నేత రాహుల్​ గాంధీ.. ప్రచారంలోనైనా.. ప్రజల్లోకి వెళ్లడంలోనైనా ఈయన రూటే సపరేటు. సాక్షాత్తు రాజకుమారుడు తమ మధ్యకు వచ్చి ముచ్చటిస్తున్నట్లు ఉంటుంది ఈయన జనంలోకి వెళ్లినప్పుడు. అలా ఏదో మీటింగ్​కు వెళ్తూ మధ్యలో కారు ఆపి రోడ్డు పక్కనే ఉన్న బండిలో చాయ్ తాగుతారు.. ప్రచారానికి వెళ్తూ.. పక్కనే కనిపించిన బజ్జీల బండి వద్దకు బజ్జీలు వేస్తూ వాళ్ల కష్టసుఖాలు తెలుసుకుంటారు. జనంలోకి వెళ్లడంలో రాహుల్​ది చాలా డిఫరెంట్ అప్రోచ్.

అలాగే తాజాగా ఆయన పరువు నష్టం కేసులో ఉత్తర్ ప్రదేశ్​లోని సుల్తాన్​పుర్​ కోర్టుకు హాజరయ్యేందుకు వెళ్లారు. తిరిగి వస్తున్న సమయంలో సుల్తాన్‌పుర్‌ శివారులోని విధాయక్‌ నగర్‌లోని రోడ్డు పక్కనే ఓ చిన్న చెప్పుల దుకాణం నడుపుకుంటున్న రామ్ చేత్ అనే వ్యక్తి వద్దకు వెళ్లారు రాహుల్. ఆయనతో కాసేపు ముచ్చటించి కష్టసుఖాలు తెలుసుకున్నారు. అంతే కాకుండా ఆయనకు సాయం చేస్తూ చెప్పులు కూడా కుట్టారు. అలాగే ఓ షూ కూడా తయారు చేశారు. ఆ తర్వాత ఆయన పడుతున్న కష్టాలు తెలుసుకుని సాయం చేస్తానని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే కేవలం మాట ఇవ్వడమే కాదు.. మరుసటి రోజే చెప్పులు కుట్టే కుట్టు యంత్రాన్ని పంపించి రామ్ చేత్​కు సాయం చేశారు. తన మాట నిలబెట్టుకున్నారు.

అయితే ఇప్పుడు రామ్ చేత్ దుకాణానికి కస్టమర్లు పెరిగిపోయారు. ఆయన ఇమేజ్ ఒక్కసారిగా మారిపోయింది. ఆ వైపునకు వెళ్తున్న వారంతా ఆగి మరి ఆయనతో మాట్లాడుతున్నారు. సెల్ఫీలు దిగి సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు. అంతే కాదండోయ్.. రామ్ చేత్ చెబుతుండగా.. రాహుల్ కుట్టిన చెప్పుల కోసం చాలా మంది ఫోన్లు కూడా చేస్తున్నారట. ఒకరైతే ఏకంగా ఆ స్లిప్పర్స్​కు రూ.10 లక్షలు ఇస్తున్నామని తనకు అమ్మమని అడిగారట. మరొకరైతే.. ‘బ్యాగు నిండా డబ్బిస్తా.. ఇచ్చేయ్’ అన్నారట.

అయితే, ఆ స్లిప్పర్స్​ను విక్రయించబోనని, రాహుల్‌కి గుర్తుగా తన వద్దే ఉంచుకుంటానని రామ్‌ చేత్‌ చెబుతున్నారు. రాహుల్ రాకతో తన షాప్​నకు డిమాండ్ పెరిగిందని.. భలే గిరాకీ వస్తోందని అంటున్నారు. రాహుల్ గాంధీ కుట్టిన చెప్పులను ఓ గ్లాస్​ ఫ్రేమ్​లో భద్రపరచనున్నట్లు వెల్లడించాడు. రాహుల్​ గాంధీ తన వద్దకు రావడం, తన జీవితాన్నే మార్చేసిందని రామ్​ చేత్​ పేర్కొన్నారు. మొత్తానికి రాహుల్ రాక రామ్ చేత్​ లైఫ్​లో ఓ టర్నింగ్ పాయింట్​గా మారిందన్నమాట.

 

 

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *