ఓటీటీలోకి ‘సుందరం మాస్టర్’ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే ?

మన Enadu: టాలీవుడ్ కమెడియన్ వైవా హర్ష ముఖ్యపాత్రలో నటించిన చిత్రం ‘సుందరం మాస్టర్’. కళ్యాణ్ సంతోష్ దర్శకుడిగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈసినిమాకు హీరో రవితేజ ప్రొడ్యూస్ చేసాడు.

ఫిబ్రవరి 23న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ మూవీలో సుందరం మాస్టర్‌గా వైవా హర్ష తన కామెడీ టైమింగ్‌తో ఆకట్టుకున్నాడు.మిర్యాల మెట్ట ఊరివాళ్లతో ఇంగ్లీష్ మాట్లాడే సీన్స్ ప్రేక్షకుల్ని బాగా అలరించాయి. కామెడీకి చిన్న సందేశాన్ని జోడించి దర్శకుడు ఈ చిత్రాని చక్కగా తెరకెక్కించాడు.. ఇక పాయింట్ బాగున్నా ‘సుందరం మాస్టర్’ కి ఆశించిన స్థాయిలో విజయం దక్కలేదు.. బాక్సాఫీస్ వద్ద యావరేజ్‌గా నిలిచింది. థియేట్రికల్ రన్‌లో నాలుగు కోట్ల వరకు వసూళ్లను రాబట్టిన ఈ మూవీ నిర్మాతలకు మోస్తారు లాభాలను తెచ్చిపెట్టింది.

ఇక థియేటర్లలో రిలీజైన నెల రోజుల్లోనే ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేస్తోంది. తాజా సమాచారం ప్రకారం ‘సుందరం మాస్టర్’ డిజిటల్ హక్కులను ఈటీవీ విన్ ఓటీటీ దక్కించుకుంది. మార్చి 22 నుంచి ఈ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతున్నట్లు సమాచారం..ఈ డేట్‌పై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రావాల్సి ఉంది.

Related Posts

ఆ అద్భుతాన్ని అవతార్-3లో చూస్తారు : జేమ్స్‌ కామెరూన్‌

‘‘సినిమా లవర్స్ అంచనాలకు మించి అవతార్-3 (Avatar-3) సినిమా ఉంటుంది. ఈసారి మేం అందించబోయే విజువల్ వండర్ చూసి అందరూ ఆశ్చర్యపోతారు. గత రెండు సినిమాల్లో చూసినవి రిపీట్ కాకుండా మూడో పార్ట్ తెరకెక్కిస్తున్నాం. కొన్ని అడ్వెంచర్స్ తో మీ ముందుకు…

అనంతపురంలో ‘డాకు మహారాజ్’ సక్సెస్ పార్టీ.. ఎప్పుడంటే?

నందమూరి బాలకృష్ణ (Balakrishna) హీరోగా బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘డాకు మహారాజ్’. శ్రద్దా శ్రీనాథ్, ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన రిలీజ్ అయింది. బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌటేలా…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *