Mahakumbh Mela: ప్రారంభమైన మహా కుంభమేళా.. తరలివస్తోన్న భక్తులు

ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమం ‘మహా కుంభమేళా(Maha Kumbhamela)’ అట్టహాసంగా ప్రారంభమైంది. ఉత్తరప్రదేశ్‌(UP)లోని ప్రయాగ్‌రాజ్‌(Prayagraj)లో ఈరోజు నుంచి ఫిబ్రవరి 26వ తేదీ వరకూ ఈ కార్యక్రమం కొనసాగనుంది. ఇప్పటికే వేలాదిగా తరలి వస్తున్న భక్తులు గంగా, యమునా, సర్వసతి నదులు కలిసే చోటైన త్రివేణీ సంగమం(Triveni Sangam) వద్ద పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. సాధవులు, సాధ్వీలు, నాగసాధువులు, కల్పవాసీలు భారీగా హాజరవుతున్నారు. 12 ఏళ్లకు ఒకసారి వచ్చే ఈ కుంభమేళాకు కేంద్రం, UP ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది.

4 వేల హెక్టార్ల విస్తీర్ణంలో ఏర్పాట్లు

ఇదిలా ఉండగా ఈ కుంభమేళా కోసం భారత్(India) నుంచే కాదు.. విదేశాల నుంచి సైతం భక్తులు(Devotees) హాజరుకానున్నారు. దాదాపు 35 కోట్ల మంది వరకూ వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ కుంభమేళా కోసం UP సర్కార్ దాదాపు రూ.7000 కోట్లు కేటాయించింది. 4 వేల హెక్టార్ల విస్తీర్ణంలో దీనికి ఏర్పాట్లు చేయగా.. 12కిలోమీటర్ల మేర ఘాట్లు సిద్ధం చేశారు. అలాగే 67వేల వీధి దీపాలు, 1.20 లక్షల మరుగుదొడ్లు(Toilets) నిర్మించారు. అలాగే ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా 45 వేల మంది పోలీసులు, 55 పోలీస్ స్టేషన్లు, డ్రోన్లు, సైబర్ సెక్యూరిటీ నిపుణులు(Cyber ​​security experts) అందుబాటులో ఉన్నారు.

భక్తులకు మహాప్రసాదం అందించనున్న అదానీ గ్రూప్

ఇదిలా ఉండగా 46 రోజులపాటు సాగే ఈ కుంభమేళాకు సామాజిక సేవలోభాగంగా అదానీ గ్రూప్(Adani Group) 50 లక్షల మంది భక్తులకు మహాప్రసాదం(Maha Prasadam) అందించనుంది. కుంభమేళా ప్రాంతంలో మాత్రమే కాదు వెలుపల రెండు వంటశాలలలో భోజనాలు ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించింది. మహా కుంభ ప్రాంతంలోని 40 ప్రదేశాలలో మహాప్రసాదం పంపిణీ చేస్తారు. ఈ కార్యక్రమంలో 2,500 మంది వాలంటీర్లు పాల్గొంటారు. అలాగే ఈ మహాకుంభ్ సమయంలో ఐదు లక్షల భగవద్గీత కాపీల(Copies of Bhagavad Gita)ను భక్తులకు పంచనున్నామని వెల్లడించింది.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *