Supreme Court CJI: సుప్రీంకోర్టు తదుపరి సీజేఐగా జస్టిస్ సంజీవ్ ఖన్నా!

Mana Enadu: భారత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్(Chief Justice of India DY Chandrachud) తన వారసుడిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా(Justice Sanjiv Khanna)ను అధికారికంగా ప్రతిపాదించారు. నవంబర్ 11న తాను పదవీ విరమణ చేస్తున్నందున, జస్టిస్ ఖన్నా తన వారసుడిగా ప్రకటిస్తున్నట్లు ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ కేంద్ర న్యాయశాఖకు లేఖ రాశారు. ప్రభుత్వ ఆమోదం పొందిన తర్వాత, జస్టిస్ ఖన్నా భారత 51వ ప్రధాన న్యాయమూర్తిగా నియమితులవుతారు. మే 13, 2025న పదవీ విరమణ చేయడానికి ముందు 6 నెలల సుప్రీంకోర్టు(Supreme Court) న్యాయమూర్తిగా ఉంటారు.

 నవంబర్ 10న పదవీ విరమణ

డీవై చంద్రచూడ్(CJI DY Chandrachud) నవంబర్ 10న పదవీ విరమణ చేయనుండగా.. సంప్రదాయం ప్రకారం పదవిలో తన వారసుడి పేరును కోరుతూ గతవారం ప్రభుత్వం ఆయనకు లేఖ రాసింది. కాగా సుప్రీంకోర్టు న్యాయమూర్తులు 65 సంవత్సరాల వయస్సులో పదవీ విరమణ చేస్తారు. అతను 1983లో ఢిల్లీ బార్ కౌన్సిల్‌(Delhi Bar Council)లో న్యాయవాదిగా నమోదు చేసుకున్నారు.

హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి కాకముందే..

అంతకుముందు ఆయన తీస్ హజారీ కాంప్లెక్స్‌లోని జిల్లా కోర్టు, తర్వాత ఢిల్లీ హైకోర్టు, ట్రిబ్యునళ్ల(Delhi High Court and Tribunals)లో ప్రాక్టీస్ చేశారు. జస్టిస్ ఖన్నా ఆదాయపు పన్ను శాఖ(Income Tax Department)కు సీనియర్ స్టాండింగ్ కౌన్సెల్‌గా కూడా పనిచేశారు. 2004లో ఢిల్లీ నేషనల్ క్యాపిటల్ టెరిటరీకి స్టాండింగ్ కౌన్సెల్ (CIVIL) అయ్యారు. జనవరి 18, 2019న ఆయన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి కాకముందే, సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. ఆయన ప్రస్తుతం నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్(Executive Chairman, National Legal Services Authority), నేషనల్ జ్యుడిషియల్ అకాడమీ(National Judicial Academy), భోపాల్ గవర్నింగ్ కౌన్సెల్ సభ్యుడిగా ఉన్నారు.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *