గ్రౌండ్​లోనే ప్రాణాలు విడిచిన క్రికెటర్​

ఓ క్రికెటర్​ మైదానంలోనే ప్రాణాలు కోల్పోయాడు. మహారాష్ట్రలోని పుణే వేదికగా జరిగిన ఎగ్జిబిషన్​ మ్యాచ్​లో ఓ ప్లేయర్​ గ్రౌండ్​లోనే కుప్పకూలిపోయి ప్రాణాలు వదిలాడు. ఆల్​రౌండర్​ అయిన 35 ఏళ్ల ఇమ్రాన్​ పటేల్​ (Imran Patel) ఓపెనర్​గా క్రీజులోకి వచ్చాడు. కాసేపటికే ఎడమవైపు ఛాతీలో నొప్పిగా ఉందని సహచర క్రికెటర్లకు చెప్పాడు. ఆ తర్వాత అంపైర్లతో చర్చించి డగౌట్​కు వెళ్తూ కుప్పకూలిపోయాడు. అది చూసిన సహచర ఆటగాళ్లు, ప్రేక్షకులు భయపడిపోయారు. ఆ మ్యాచ్​ లైవ్​ స్ట్రీమింగ్​ జరుగుతుండడంతో వీడియోలు బయటకు వచ్చేశాయి.

అప్రమత్తమై వెంటనే ఇమ్రాన్​ పటేల్​ను ఆస్పత్రికి తరలించినా ఫలితం లేదు. అతడు అప్పటికే చనిపోయాడని డాక్టర్లు నిర్ధారించారు. తోటి క్రికెటర్​ మృతితో సహచరులంతా బాధలో మునిగిపోయారు. ఎంతో ఫిట్​గా ఉండే ఇమ్రాన్​కు ఇలా జరుగుతుందని అస్సలు ఊహించలేదని, ప్రతి మ్యాచ్​లోనూ ఎంతో యాక్టివ్​గా ఉంటాడని పేర్కొన్నారు. గతంలో ఎన్నడూ అతడు అనారోగ్య సమస్యలు ఎదుర్కోలేదన్నారు. ఆటపై ఎంతో ప్యాషన్​ ఉన్న ఇమ్రాన్​ లాంటి క్రికెటర్​ను కోల్పోవడం దిగ్భ్రాంతికి గురిచేసిందని వాపోయారు.

మృతుడు ఇమ్రాన్​కు భార్య, ముగ్గురు కుమార్తెలు, ఒక కొడుకు ఉన్నారు. బాలుడి వయసు కేవలం నాలుగు నెలలు మాత్రమే. పుణెలో ఇదే ఏడాది సెప్టెంబర్​లో హబీబ్​ షేక్​ అనే క్రికెటర్​ కూడా గ్రౌండ్​లోనే ప్రాణాలు కోల్పోయాడు. అతడికి అప్పటికే డయాబెటిస్​ సమస్య ఉంది.

Related Posts

BWF World Championships: సెమీస్‌లో చిరాగ్-సాత్విక్ జోడీ.. సింధుకు తప్పని ఓటమి

పారిస్‌లో జరుగుతున్న బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ (BWF World Championships-2025)లో భారత్‌కు మిశ్రమ ఫలితాలు దక్కాయి. పురుషుల డబుల్స్‌లో సాత్విక్‌ సాయిరాజ్ రంకిరెడ్డి(Satwiksairaj Rankireddy), చిరాగ్ శెట్టి(Chirag Shetty) జోడీ అద్భుత ప్రదర్శనతో సెమీఫైనల్‌(Semifinals)కు చేరి పతకాన్ని ఖాయం చేసుకుంది.…

PKL- 2025: సాగర తీరంలో కబడ్డీ కూత.. నేటి నుంచి పీకేఎల్ సీజన్ 12 షురూ

క‌బ‌డ్డీ అభిమానులు ఎంత‌గానో ఎదురుచూస్తున్న Pro Kabaddi League-2025 వ‌చ్చేసింది. ఇప్ప‌టికే విజ‌యవంతంగా 11 సీజ‌న్లు పూర్తి చేసుకుంది. నేటి (ఆగ‌స్టు 29) నుంచి 12వ సీజ‌న్ (PKL 12) ప్రారంభం కానుంది. ఈ సారి మొత్తం 12 జ‌ట్లు టైటిల్…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *