పుట్టినరోజుపార్టీలో కేకు తిని..ఆసుపత్రికి పరుగులు పెట్టారు..ఎక్కడో తెలుసా..

మన ఈనాడు: పుట్టినరోజు పార్టీలో కేకు తిన్న కొద్ది సేపటికే వాంతులు , విరోచనాలతో హస్పటల్​ అడ్మిట్​ అయిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగింది.

పాల్వంచ పట్టణానికి చెందిన నరసింహరావు తన కూతురు పుట్టినరోజు వేడుకలను కుటుంబసభ్యులతో ఘనంగా జరుపుకునేందుకు సిద్దం అయ్యారు. ఈక్రమంలోనే పాల్వంచలోనే ఐస్​ మ్యాజిక్​ అనే బేకరీకి వెళ్లి కిలో కేకు ఆర్డర్​ చేశారు.

నిల్వచేసిన కేకును బేకరీ ఓనర్​ నరసింహరావుకు విక్రయించాడు. దీంతో కేకుకు బూజు పట్టిన విషయం గమనించలేదు. అదే కేకుతో పుట్టినరోజు వేడుకల్లో కట్​ చేసి అందరూ కలిసి తిన్నారు. ఒక్కొక్కరికి వాంతులు, విరోచనాలు మొదలయ్యాయి. స్థానికంగా ఎన్న ఓ ఆసుపత్రిలో అడ్మిట్​ చేసి ట్రిట్మంట్​ చేసే పరిస్థితి ఏర్పడింది.
దీనిపై బాధితుడు నరసింహరావు పాల్వచ మున్సిపల్​ అధికారులకు పిర్యాదు చేశాడు. విచారణ చేసి రూ.7వేలు ఫైన్​ వేశారు. మరోసారి నాణ్యత లేని ఆహార పదార్థాలు విక్రయాలు చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామని శానిటేషన్​ అధికారి కేవీ లక్ష్మణ్​రవు, హెచ్చరించారు.

Related Posts

Prakash Raj: బెట్టింగ్ యాప్స్ వ్యవహారం.. ఈడీ విచారణకు హాజరైన ప్రకాశ్ రాజ్

బెట్టింగ్ యాప్స్ వ్యవహారం సిని ఇండస్ట్రీలో కలకలం రేపిన విషయం తెలిసిందే. బెట్టింగ్ యాప్స్ వ్యవహారంలో మనీ లాండరింగ్ జరిగినట్టు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) అనుమానిస్తోంది. నిందితులుగా ఉన్న కొందరు సినీ ప్రముఖులకు నోటీసులు జారీ చేసింది. పలువురు నటీనటుల మీద…

Payal Rajput: నటి పాయల్ రాజ్‌పుత్ ఇంట్లో తీవ్ర విషాదం

ప్రముఖ హీరోయిన్ నటి పాయల్ రాజ్‌పుత్(Payal Rajput) ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆమె తండ్రి విమల్ కుమార్ రాజ్‌పుత్(Vimal Kumar Rajput) (67) ఢిల్లీలో సోమవారం కన్నుమూశారు. ఈ విషాద సంఘటనను తాజాగా పాయల్ సోషల్ మీడియా(SM) ద్వారా వెల్లడించింది.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *