మన ఈనాడు: 20ఏళ్లుగా గులాబీ జెండా ఎత్తారు..తెలంగాణ సాధించాక పదవుల ఆశించకుండా సుపరిపాలన అందాలని కోరుకున్నారు.. కానీ ఉప్పల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ అవలంభిస్తున్న తీరు ఉద్యమకారులను చులకన చేసి చూస్తుందని వాపోయ్యారు.
బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా మూకుమ్మడిగా రాజీనామాలు చేసి బీఆర్ఎస్ అభ్యర్థికి గుబులు రేపారు. జనంపల్లి వెంకటేశ్వరరెడ్డి, గరిక సుధాకర్ల ఆధ్వర్యంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఉప్పల్ కాంగ్రెస్ అభ్యర్థి మందముల పరమేశ్వరరెడ్డి విజయం కోసం కృషి చేసి గెలపించుకుంటామని చెప్పారు. 100మంది ఉద్యమకారులు బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్లో చేరారు.కొండల్రెడ్డి, వనంపల్లి గోపాల్రెడ్డి, బండ వినేష్రెడ్డి, కొంగల శ్రీధర్, నరసింహ, నానాపురం వంశీ, ఎండీ సర్పరాజ్, చందు, అశోక్ లతోపాటు మరికొంతమంది కాంగ్రెస్ కండువాలు కప్పుకున్నారు.
Khammam|OPS సాధనే ఎజెండా..ధర్నా చౌక్ కేంద్రంగా యుద్ధభేరి
ఉద్యోగులకు పదవీ విరమణ అనంతరం భరోసా ఇవ్వలేని ఏకీకృత పెన్షన్ విధానాన్ని (ఓపీఎస్) వ్యతిరేకిస్తూ.. మార్చి 2న ధర్నా చౌక్ కేంద్రంగా యుద్ధ భేరీ మోగించనున్నామని సిపిఎస్ఇయు ఖమ్మం జిల్లా అధ్యక్షుడు చంద్రకంటి శశిధర్ ప్రకటించారు. యుద్ధభేరి సన్నాహక కార్యక్రమాల్లో భాగంగా…









