
ఐపీఎల్ (Indian Premier League) 2025లోని మిగిలిన మ్యాచ్లను వారం రోజుల పాటు వాయిదా వేస్తున్నట్లు భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ప్రకటించింది. భారత్-పాకిస్థాన్(India-Pakistan War Crisis) మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు, ఆటగాళ్ల భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు BCCI వర్గాలు స్పష్టం చేశాయి.
భద్రతా కారణాల దృష్ట్యా మధ్యలోనే..
దేశంలో నెలకొన్న సున్నితమైన పరిస్థితుల నేపథ్యంలో క్రికెట్ మ్యాచ్(Matchs)ల నిర్వహణ శ్రేయస్కరం కాదని BCCI భావించింది. ఈ క్రమంలోనే, మే 8న ధర్మశాల వేదికగా PBKS VS DC జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్ను భద్రతా కారణాల దృష్ట్యా మధ్యలోనే నిలిపివేయాల్సి వచ్చింది. వాస్తవానికి, ఈ రోజు లక్నో సూపర్ జెయింట్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(LSG vs RCB) మధ్య మ్యాచ్ జరగాల్సి ఉంది.
రేపటి మ్యాచ్ టికెట్ డబ్బులూ వాపస్
అయితే, BCCI తాజా ఆదేశాలతో నేటి నుంచి IPL మ్యాచ్లన్నీ తాత్కాలికంగా నిలిచిపోయాయి. ఈ నిర్ణయంతో ఇప్పటికే టికెట్లు కొనుగోలు చేసిన అభిమానులకు ఆయా ఫ్రాంచైజీలు డబ్బులను తిరిగి చెల్లించే ప్రక్రియను ప్రారంభించాయి. మే 10వ తేదీన హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియంలో KKR vs SRH మధ్య జరగే కీలక మ్యాచ్కు టికెట్లు బుక్ చేసుకున్న అభిమానులకు రీఫండ్ చేస్తోంది.
Sunrisers Hyderabad announce ticket refunds as IPL 2025 suspended with immediate effect.#IPL2025 #SunrisersHyderabad #KolkataKnightRiders #CricketTwitter pic.twitter.com/X5HTnG4Hzh
— InsideSport (@InsideSportIND) May 9, 2025