IPL 2025: ఐపీఎల్ వాయిదా.. టికెట్ డబ్బులు వాపస్

ఐపీఎల్ (Indian Premier League) 2025లోని మిగిలిన మ్యాచ్‌లను వారం రోజుల పాటు వాయిదా వేస్తున్నట్లు భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ప్రకటించింది. భారత్-పాకిస్థాన్(India-Pakistan War Crisis) మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు, ఆటగాళ్ల భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు BCCI వర్గాలు స్పష్టం చేశాయి.

భద్రతా కారణాల దృష్ట్యా మధ్యలోనే..

దేశంలో నెలకొన్న సున్నితమైన పరిస్థితుల నేపథ్యంలో క్రికెట్ మ్యాచ్‌(Matchs)ల నిర్వహణ శ్రేయస్కరం కాదని BCCI భావించింది. ఈ క్రమంలోనే, మే 8న ధర్మశాల వేదికగా PBKS VS DC జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్‌ను భద్రతా కారణాల దృష్ట్యా మధ్యలోనే నిలిపివేయాల్సి వచ్చింది. వాస్తవానికి, ఈ రోజు లక్నో సూపర్ జెయింట్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(LSG vs RCB) మధ్య మ్యాచ్ జరగాల్సి ఉంది.

రేపటి మ్యాచ్ టికెట్ డబ్బులూ వాపస్

అయితే, BCCI తాజా ఆదేశాలతో నేటి నుంచి IPL మ్యాచ్‌లన్నీ తాత్కాలికంగా నిలిచిపోయాయి. ఈ నిర్ణయంతో ఇప్పటికే టికెట్లు కొనుగోలు చేసిన అభిమానులకు ఆయా ఫ్రాంచైజీలు డబ్బులను తిరిగి చెల్లించే ప్రక్రియను ప్రారంభించాయి. మే 10వ తేదీన హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో KKR vs SRH మధ్య జరగే కీలక మ్యాచ్‌కు టికెట్లు బుక్ చేసుకున్న అభిమానులకు రీఫండ్ చేస్తోంది.

Related Posts

Hyderabad Metro: పెరిగిన హైదరాబాద్ మెట్రో ఛార్జీలు

హైదరాబాద్ మెట్రో రైలు ఛార్జీలు పెరిగాయి. కనీస ఛార్జీ రూ.10 నుంచి రూ.12కి, గరిష్ఠా ఛార్జీ రూ.60 నుంచి రూ.75కు పెంచుతున్నట్లు హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ గురువారం ప్రకటించింది. పెంచిన ధరలు ఈ నెల 17 నుంచి అమలు కానున్నట్లు…

Bellamkonda Srinivas: హీరో బెల్లంకొండ శ్రీనివాస్‌పై కేసు

టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్‌పై (Bellamkonda Srinivas) కేసు నమోదైంది. రాంగ్ రూట్‌లో కారు నడపడమే కాకుండా ట్రాఫిక్ పోలీస్తో శ్రీనివాస్ దురుసుగా ప్రవర్తించడంతో జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు బుక్ అయ్యింది. ఈనెల 13న జూబ్లీహిల్స్ జర్నలిస్ట్ కాలనీలోని…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *