PM MODI USA TOUR: క్వాడ్ లీడర్స్ సమ్మిట్‌.. అమెరికా చేరుకున్న PM మోదీ

ManaEnadu: అమెరికా చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీ(PM Narendra Modi) ఫిలడెల్ఫియా విమానాశ్రయం(Philadelphia airport) వెలువల ప్రవాస భారతీయుల(Expatriate Indians)తో ముచ్చటించారు. మోదీ రాక సందర్భంగా ఆయన్ను ఆహ్వానించేందుకు పెద్ద సంఖ్యలో భారతీయులు(Indians) అక్కడికి చేరుకున్నారు. వారితో మోదీ కరచాలనం చేస్తూ, ఆటోగ్రాఫ్‌(Autograph)లు ఇచ్చారు. విద్యార్థుల(Students)తో ముచ్చ‌టించారు. మూడు రోజుల పర్యటనకు గానూ మోదీ అమెరికా(America) బయల్దేరి వెళ్లారు. అమెరికాలో ఆయన మొదట క్వాడ్ లీడర్స్ సమ్మిట్‌(Quad Leaders Summit)లో పాల్గొంటారు. అమెరికాలో అధ్యక్ష ఎన్నికల హడావుడి కొనసాగుతున్న సమయంలో ప్రధాని మోదీ అక్కడ పర్యటిస్తుండడం విశేషం.

 ఇండో-పసిఫిక్ ప్రాంత అభివృద్ధిపై చర్చలు

అమెరికా పర్యటనలో భాగంగా PM మోదీ 6వ క్వాడ్ లీడర్స్ సమ్మిట్, ఐక్యరాజ్యసమితి ‘సమ్మిట్ ఆఫ్ ది ఫ్యూచర్(Summit of the Future)’లో పాల్గొని ప్రసంగిస్తారని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్(Randhir Jaiswal) వెల్లడించారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్(Joe Biden) స్వస్థలం డెలావేర్‌లోని విల్మింగ్టన్‌లో క్వాడ్ లీడర్స్ సమ్మిట్ జరుగుతోంది. ఇండో-పసిఫిక్(Indo-Pacific) ప్రాంతంలోని దేశాల అభివృద్ధి లక్ష్యాలు, ఆకాంక్షలను చేరుకోవడంలో సహాయపడటానికి ఈ శిఖరాగ్ర సమావేశంలోని నాయకులు గత ఏడాది పురోగతిని సమీక్షిస్తారని, రాబోయే సంవత్సరానికి ఎజెండా(Agenda)ను నిర్ణయిస్తారని భారత విదేశాంగ శాఖ తెలిపింది.

ప్రధాన చర్చ రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపైనే

కాగా ఈ 6వ క్వాడ్ (QUAD) శిఖరాగ్ర సమావేశంలో రష్యా-ఉక్రెయిన్ యుద్ధం(Russia-Ukraine War), పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతలు, ఇండో-పసిఫిక్‌లో పరిస్థితులు వంటి అంతర్జాతీయ సవాళ్లపై నేతలు చర్చించనున్నారు. ఈ సమావేశం అనంతరం అమెరికా అధ్యక్షుడు బైడెన్, ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్(Australian Prime Minister Anthony Albanese), జపాన్ ప్రధాని ఫ్యూమియో కిషిడా(Prime Minister of Japan Fumio Kishida)తో మోదీ ద్వైపాక్షిక చర్చలు(Bilateral negotiations) జరుపుతారు. క్వాడ్ కూటమిలో IND, ఆస్ట్రేలియా, జపాన్, USA సభ్య దేశాలుగా ఉన్నాయి.

మరోవైపు SEP 22న లాంగ్ ఐలాండ్‌లోని ప్రవాస భారతీయులతో సంభాషించడానికి మోదీ న్యూయార్క్(New York) వెళ్లనున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), క్వాంటమ్ కంప్యూటింగ్, సెమీకండక్టర్స్(Semiconductors), బయోటెక్నాలజీ వంటి అత్యాధునిక రంగాల్లో ఇరు దేశాల మధ్య మరింత సహకారాన్ని పెంపొందించడానికి అమెరికాకు చెందిన ప్రముఖ కంపెనీల సీఈవోలతో ఆయన భేటీ అవుతారని భారత విదేశాంగ శాఖ తెలిపింది.

Related Posts

Donald Trump: ట్రంప్ మరో నిర్ణయం.. ఇకపై ఆర్మీలోకి ట్రాన్స్‌జెండర్లకు నో ఎంట్రీ!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) తన నిర్ణయాలతో విదేశాలతోపాటు అమెరికన్లకు వరుస షాక్‌లు ఇస్తున్నారు. ఇప్పటికే ఇమ్మిగ్రేషన్ రూల్స్‌(Immigration Rules)ను స్ట్రిక్ట్ చేసిన ట్రంప్.. USలో కేవలం పరుషులు(Male), స్త్రీల(Female)కు మాత్రమే గుర్తింపు ఉంటుందని, మరో జెండర్‌ను గుర్తించే ప్రసక్తే…

PM Modi: ప్రపంచ యుద్ధాల్లో అమరులైన జవాన్లకు మోదీ నివాళులు

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(PM Narendra Modi) ఫ్రాన్స్ పర్యటన(France Tour) కొనసాగుతోంది. ఈ సందర్భంగా ఇవాళ పలు ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. ప్రపంచ యుద్ధాల్లో (World War) ప్రాణాలు కోల్పోయిన భారత సైనికుల త్యాగాలకు గుర్తుగా ఫ్రాన్స్‌లోని మార్సెయిల్స్‌లో (Marseilles) గల…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *