BREAKING: హైదరాబాద్‌లో ఘరానా మోసం.. రూ.200 కోట్లకు కుచ్చుటోపీ

Mana Enadu: అధిక వడ్డీలకు ఆశపడి కొంతమంది సామాన్యులు ప్రైవేటు ఫైనాన్స్‌లో రూ.కోట్లు డిపాజిట్ చేశారు. కానీ, రాత్రికి రాత్రే ఆ సంస్థ బోర్డు తిప్పేసి వారి నోట్లో మట్టికొట్టిన ఘటన హైదారబాద్‌ నగరంలోని ఆబిడ్స్‌లో చోటుచేసుకుంది.

 అబిడ్స్‌లోని శ్రీ ప్రియాక ఎంటర్‌ప్రైజెస్ పేరుతో ఓ సంస్థ తమ వద్ద పెట్టుబడి పెడితే.. మార్కెట్‌లో ఉన్న వడ్డీ రేటు కంటే అధికంగా చెల్లిస్తామని నమ్మబలికింది. అదేవిధంగా సంస్థ నుంచి ఎజెంట్లను నియమించుకుని సామాన్యుల నుంచి రూ.200 కోట్ల మేర డిపాజిట్లను సేకరించింది. అనంతరం రాత్రికి రాత్రే అందిన కాడికి దండుకుని సంస్థ ప్రతినిధులు ఏకంగా బోర్డు తిప్పేశారు.

దీంతో తాము మోసపోయామని గ్రహించిన బాధితులు తమకు న్యాయం చేయాలంటూ బషీర్‌బాగ్ సీసీఎస్(CCS) పీఎస్ వద్ద ఆందోళన చేపట్టారు. దాదాపు 517 మంది ఇప్పటి వరకు శ్రీ ప్రియాంక ఎంటర్‌ప్రైజెస్‌లో డిపాజిట్లు చేసినట్లుగా తెలుస్తోంది. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు, నిందితుల కోసం గాలిస్తున్నారు.

Related Posts

Khammam|కార‌ణం తెలియ‌దు కానీ..ఖ‌మ్మం ఘ‌ట‌న దుర‌దృష్ట‌క‌రం

ఖ‌మ్మం ప‌త్తి మార్కెట్లో అగ్నిప్ర‌మాదం జ‌ర‌గ‌డానికి త‌న‌కి ఇంకా కార‌ణం తెలియ‌దు కానీ ఘ‌ట‌న జ‌ర‌గ‌డం దుర‌దృష్ట‌క‌రమ‌ని వ్య‌వ‌సాయ‌శాఖ మంత్రి తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు అన్నారు. జిల్లా క‌లెక్ట‌ర్‌, పోలీస్ క‌మిష‌న‌ర్‌తో క‌లిసి గురువారం ఖ‌మ్మం ప‌త్తి మార్కెట్లో ప్ర‌మాదం జ‌రిగిన తీరును…

IMD Report: దేశంలో ప్రకృతి ప్రకోపం.. గత ఏడాది 3200 మంది మృతి

భారత్‌(India)లో ప్రకృతి వైపరీత్యాలు(Natural Calamities) ఈ మధ్య తీవ్రంగా ప్రతాపం చూపుతున్నాయి. తాజాగా దేశంలో ప్రకృతి వైపరీత్యాల ద్వారా 3200 మంది మరణించారని భారత వాతావరణ వార్షిక నివేదిక(Indian Meteorological Annual Report-2024) పేర్కొంది. ఇందులో అత్యధికంగా పిడుగుల ద్వారా 1374…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *