Basara: రైల్వే స్టేషన్​లో లవర్స్​ సూసైడ్​

నిజామాబాద్ నగరానికి చెందిన యువతీ, యువకుడు నిర్మల్ జిల్లా బాసరలో ఆత్మహత్యకు పాల్పడ్డారు. బుధవారం రాత్రి బాసర రైల్వే స్టేషన్ సమీపంలో నర్సాపూర్ – నాగర్​ సోల్ ఎక్స్​ప్రెస్​ ట్రైన్​ కిందపడి ఇద్దరు సూసైడ్ చేసుకున్న సంఘటన కలకలం రేపుతుంది.

నిజామాబాద్ రైల్వే ఎస్సై సాయి రెడ్డి కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.. నిజామాబాద్ నగరంలోని కోటగల్లికి చెందిన సూరం ప్రవీణ్(28), సీతారాంనగర్ కాలనీకి చెందిన నందిత(20)లు బాసర రైల్వే స్టేషన్ సమీపంలో రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ప్రవీణ్ నగరంలోని పాంగ్రలో గల విశ్వభారతి ప్రైవేట్ పాఠశాలలో లెక్చరర్​గా పని చేస్తున్నాడు.

నందిత నిశిత కళాశాలలో డిగ్రీ సెకండియర్ చదువుతోంది. వీరిద్దరూ కొంతకాలంగా ప్రేమలో ఉన్నట్లు తెలిసింది. నందిత కాలేజీలో చాలా మెరుగైన విద్యార్థి అని సహచర విద్యార్థులు తెలిపారు. యువకుడు ప్రవీణ్ సైతం సీన్సియర్ అని, వారి కుటుంబం ఆర్థిక కష్టాల్లో ఉన్నట్లు స్థానికుల ద్వారా తెలిసింది. వీరిద్దరి మృతితో ఇరు కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఇద్దరి ప్రేమ పెళ్లికి కుటుంబ సభ్యులు అంగీకరించకపోవడం ఆత్మహత్యకు కారణంగా తెలుస్తోంది. రైల్వే పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.ఇరువురి తల్లిదండ్రులు భోరున విలపిస్తున్నారు.

Related Posts

Mahakumbh: కుంభమేళా తొక్కిసలాట.. సహాయక చర్యలపై PM మోదీ ఆరా

మహా కుంభమేళా(Mahakumbha Mela) ప్రపంచంలోనే అతిపెద్ద అధ్యాత్మిక కార్యక్రమం. 144 ఏళ్లకు ఒకసారి వచ్చే మహత్తర వేడుక. కోట్లాది మంది తరలివచ్చే బృహత్తర ఆధ్యాత్మిక ఉత్సవం. 45 రోజుల పాటు కొనసాగే ఈ మహా కుంభమేళాకు దేశవిదేశాల నుంచి భక్తులు తరలివస్తున్నారు.…

Mahakumbh 2025: కుంభమేళాలో తొక్కిసలాట.. 17 మందికిపైగా మృతి!

ఉత్తరప్రదేశ్‌(UP)లోని ప్రయాగ్‌రాజ్‌(Prayagraj)లో జరుగుతున్న కుంభమేళా(Mahakumbh)లో విషాదం చోటుచేసుకుంది. మౌని అమావాస్య(Moni Amavasya) సందర్భంగా పెద్దయెత్తున జనం తరలిరావడంతో తొక్కిసలాట చోటుచేసుకుంది. త్రివేణీ సంగమం(Triveni Sangamam) సమీపంలోని సంగం ఘాట్ వద్ద భక్తులు(Devotees) పుణ్యస్నానాలు ఆచరించేందుకు తరలివచ్చేక్రమంలో భారీగా భక్తులు గుమిగూడారు. దీంతో…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *