Telangana: రైతులకు గుడ్ న్యూస్.. రుణమాఫీ లబ్ధిదారుల లిస్ట్ రెడీ!

Mana Enadu: పంట రుణమాఫీకి సంబంధించిన విధివిధానాలు రూపొందించాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. ఇచ్చిన మాట ప్రకారం ఆగస్టు 15లోగా రుణమాఫీ చేసి తీరాల్సిందేనన్నారు. లబ్ధిదారుల పూర్తి డేటా సేకరించి ప్రణాళిక సిద్ధం చేయాలని ఆదేశించారు.

CM Revanth: రుణమాఫీకి సంబంధించి విధివిధానాలు రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Reventh Reddy)అధికారులకు సూచించారు. పంట రుణమాఫీ, ఇతర అంశాలపై వ్యవసాయ, సహకార శాఖ అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం సమీక్ష నిర్వహించారు.

రూ.2లక్షల వరకు రుణాలు ఉన్న రైతుల జాబితాను సిద్ధం చేయాలన్నారు. పూర్తి స్థాయిలో బ్యాంకర్ల నుంచి రైతుల వివరాలు సేకరించి అర్హులను గుర్తించాలని తెలిపారు. కటాఫ్ డేట్ విషయంలో సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం అధికారులకు సూచించారు.

బ్యాంకుల నుంచే కాకుండా, పీఏసీఎస్ (PACS)నుంచి పంట రుణాలు తీసుకున్న రైతుల వివరాలను అందుబాటులో ఉండేలా చూడాలని తెలిపారు. రూ.2లక్షల రైతు రుణమాఫీ చేసేందుకు పూర్తి స్థాయి వివరాలతో పాటు అవసరమైన అంచనా వ్యయాన్ని రూపొందించాలని అధికారులకు సూచించారు.

ఆగస్టు 15లోగా పంట రుణమాఫీ చేసి తీరాలని ముఖ్యమంత్రి అధికారులకు తేల్చి చెప్పారు. ఈ సమీక్షా సమావేశంలో ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క(Mallu Bhatti Vikramarka), మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, సంబంధిత శాఖా అధికారులు పాల్గొన్నారు.

Share post:

లేటెస్ట్