Chicken Biryani: రూ.2కే చికెన్ బిర్యానీ.. ఎక్కడో తెలుసా?

Mana Enadu:ఆల్ మోస్ట్ భోజన ప్రియులందరికీ ఆల్ టైమ్ టేస్టీ ఫుడ్(Testy Food) బిర్యానీ. ఈ పేరు వింటే చాలు చాలా మందికి నోరూరుతుంది. ఒక్కమాటలో చెప్పాలంటే బిర్యానీ(Biryani) అంటే.. బిర్యానీనే.. భయ్యా. ముఖ్యంగా హైదరాబాదీ బిర్యానీ ఇండియా(India)లోనే మోస్ట్ పాపులర్. ఇది చాలా వరకు ఆరోగ్యకరమైనదని చాలా రీసెర్చ్‌లలో తేలింది. అయితే శ్రావణ మాసంలో మాకెందుకీ బిర్యానీ గోల అని అనుకుంటున్నారా? అవునండీ.. ఇప్పుడు ఈ ఫుడ్డే తెగ వైరల్ అవుతోంది. ఎందుకంటారా.. సాధారణంగా సింగల్ బిర్యానీ మినిమం రూ.160-180 వరకు ఉంటుంది. కొంచెం క్వాలిటీ, క్వాంటిటీ తక్కువున్న చోట్ల అయితే ఆఫర్ల పేరిట రూ.79, రూ.99, రూ.129గా ఉంటుంది. కానీ ఇప్పుడు మనం మాట్లాడుకోబోచే బిర్యానీ రేటెంతో తెలుసా?.. అయితే వార్త మొత్తం చదివేయండి..

ఎగబడ్డ జనం..

ఆంధ్రప్రదేశ్‌(Andhra pradesh)లోని పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణంలో కొత్తగా ఓ రెస్టారెంట్‌ను ఏర్పాటు చేశారు. రూ.2కే చికెన్ బిర్యానీ అంటూ బంపర్ ఆఫర్ ప్రకటించారు. ఇంకేముంది.. జనాలు రెచ్చిపోయారు. గంటల తరబడి క్యూల్లో నిలబడి బిర్యానీ కోసం ఎగబడ్డారు. దాంతో అందరికీ బిర్యానీ అందించలేక నిర్వాహకులు చేతులెత్తేశారు.

ఇదండీ రూ.2ల బిర్యానీ స్టోరీ..

అయితే, హోటల్ నిర్వాహకులు 200 బిర్యానీ ప్యాకెట్లు మాత్రమే సిద్ధం చేయగా, అక్కడికి వచ్చిన వాళ్ల సంఖ్య 2వేలకు పైనే ఉందని స్థానిక పోలీసులు తెలిపారు. బిర్యానీ ప్యాకెట్లు అందనివాళ్లు తీవ్ర నిరాశ చెందారు. బాహాటంగా తమ అసంతృప్తిని వెళ్లగక్కారు. భారీ సంఖ్యలో జనం రావడంతో అక్కడ తొక్కిసలాట చోటుచేసుకోవడంతో పోలీసులు రావాల్సి వచ్చింది. స్థానిక సీఐ ఆధ్వర్యంలో పోలీసులు పరిస్థితిని చక్కదిద్దారు. జనానికి సర్దిచెప్పి ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. ఇదండీ రూ.2ల బిర్యానీ స్టోరీ..

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *