TG:సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుకు భూమిపూజ.. డిసెంబర్ 9న ఆవిష్కరణ

ManaEnadu:రాష్ట్ర సచివాలయ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుకు అడుగు ముందు పడింది. విగ్రహం ఏర్పాటుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ (ఆగస్టు 28వతేదీ) భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో సీఎంతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు పాల్గొన్నారు. డిసెంబర్‌ 9వ తేదీన తెలంగాణ తల్లి (Telangana Talli Statue) విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. శంకుస్థాపన అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.

తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుకు ప్రభుత్వం సంకల్పించిందని సీఎం తెలిపారు. సచివాలయం (Telangana Secretariat)లో విగ్రహ ఏర్పాటుపై జూన్‌ 2న ప్రకటించానని.. తెలంగాణ ఏర్పాటుకు డిసెంబర్‌ 9 పునాది రాయిగా మారిందని వెల్లడించారు. అందుకే రాష్ట్ర ప్రజలకు డిసెంబర్‌ 9 పండుగ రోజు అన్న సీఎం.. ఆరోజునే తెలంగాణ తల్లి విగ్రహ ప్రారంభోత్సవం జరుపుకోబోతున్నామని ప్రకటించారు.

60 ఏళ్ల తెలంగాణ ఆకాంక్షను సోనియా గాంధీ నెరవేర్చారని పునరుద్ఘాటించారు. 2014లో తెలంగాణ ఏర్పాటు కల సాకారమైందన్న ముఖ్యమంత్రి (CM Revanth Reddy).. తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటుకు గత పాలకులకు మనసు రాలేదని విమర్శించారు. తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటును తెరమరుగు చేశారని మండిపడ్డారు. తామే తెలంగాణ అనే విధంగా గత పాలకులు వ్యవహరించారని.. ప్రగతి భవన్‌ (Pragati Bhavan)లో గడి నిర్మించుకుని పోలీసు పహారా పెట్టారని ఆరోపించారు.

కానీ గత ప్రభుత్వ విధానాలకు కాంగ్రెస్‌ ప్రభుత్వం వ్యతిరేకమని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. ప్రగతి భవన్‌ను ప్రజా భవన్‌గా మార్చామని తెలిపారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం దేశానికి ఆదర్శంగా నిలుస్తోందని వెల్లడించారు. రాష్ట్ర ఏర్పాటులో కీలకపాత్ర పోషించిన నేతల ఆనవాళ్లు ఇక్కడ ఉన్నాయన్న ఆయన.. రాజీవ్‌గాంధీ విగ్రహం లేకపోవడం లోటుగా భావించామని పేర్కొన్నారు. అందుకే రాజీవ్‌గాంధీ విగ్రహం ఏర్పాటు చేయాలని మేధావులు సూచించారని చెప్పారు.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *