గులాబీ మేనిఫెస్టో రేపే విడుద‌ల‌

మ‌న ఈనాడుః షెడ్యూల్‌ అలా విడుదలయ్యిందో లేదో ఒక్కసారిగా స్పీడ్ మీద ఉన్నాయి పార్టీలు. గెలుపే లక్ష్యంగా దూకుడు రెట్టింపు చేశాయి. కాంగ్రెస్‌, బీజేపీతో పోలిస్తే అధికార పార్టీ బీఆర్‌ఎస్సే స్పీడుమీదుంది. ఎలక్షన్‌ షెడ్యూల్‌ రాకముందు నుంచే కేటీఆర్‌ జిల్లాలను ప‌ర్య‌ట‌న ప్రారంభించారు. ఆదివారం నుంచి గులాబీ ద‌ళ‌ప‌తి రంగంలోకి దిగ‌బోతున్నారు.

అక్టోబర్ 15వ తేదీన బీఆర్‌ఎస్‌ మేనిఫెస్టోను ప్రకటిస్తున్నారు. అంతేగాకుండా హుస్నాబాద్‌లో ప్ర‌చార స‌భ‌ సమరశంఖం పూరించేందుకు రెడీ అయ్యారు కేసీఆర్‌. కాంగ్రెస్‌ గ్యారెంటీలు, బీజేపీ హామీలను తలదన్నేలా బీఆర్‌ఎస్‌ మేనిఫెస్టో ఉండబోతోందని కేటీఆర్ ప‌లు వేదిక‌ల‌పై ప్ర‌సంగించారు. ఈసారి మేనిఫెస్టో సరికొత్తగా, ఆసక్తికరంగా ఉంటుందంటుని ప్ర‌జ‌ల్లోకి తీసుక‌పోతున్నారు. కాగా బీఆర్‌ఎస్‌ వర్గాల నుంచి అందుతోన్న సమాచారం ప్రకారం ఇప్పటికే అమలవుతోన్న పథకాలు కొనసాగించడతోపాటు కొత్త ప‌థ‌కాలు తీసుకొస్తున్నారు.

బీఆర్ ఎస్ మేనిఫెస్టో
☛ ఇప్పటికే అమలవుతోన్న పథకాలు కొనసాగింపు

☛ రైతులు, మహిళల కోసం ప్రత్యేక పథకాలు

☛ రైతాంగం, వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యత

☛ రైతుబంధు, రైతు బీమా నగదు పెంచే అవకాశం

☛ మహిళా సాధికారత కోసం ప్రత్యేక కార్యాచరణ

☛ దిగువ, మధ్యతరగతి కుటుంబాల కోసం కొత్త పథకాలు

☛ ఒంటరి మహిళలు, బీసీలు, మైనారిటీల కోసం స్పెషల్ స్కీమ్స్‌

☛ దళితబంధు, బీసీ బంధు, మైనారిటీ బంధుపై మరింత ఫోకస్‌

☛ యువత, గృహిణులు, ఒంటరి మహిళల కోసం ప్రత్యేక పథకాలు

హుస్నాబాద్ సభకు ఏర్పాట్లు..
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో ఈ నెల 15న జరిగే సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభ పనులు శరవేగంగా జరుగుతున్నాయని స్థానిక ఎమ్మెల్యే సతీష్ కుమార్ తెలిపారు. ఇప్పటికే హెలిప్యాడ్ నిర్మాణం పూర్తయిందని, సభాస్థలి వేదిక పనులు రేపటి వరకు పూర్తవుతాయన్నారు. సీఎం కేసీఆర్ సభాస్థలంలో జరుగుతున్న ఏర్పాట్లను పార్టీ శ్రేణులతో కలిసి ఎమ్మెల్యే సతీష్ కుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ హుస్నాబాద్ నియోజకవర్గం సీఎం కేసీఆర్ కు లక్ష్మీ నియోజకవర్గమని, గతంలో 2014 ,2018 రెండుసార్లు హుస్నాబాద్ నుండి కేసీఆర్ ఎన్నికల ప్రచారాన్ని బహిరంగ సభ ద్వారా ప్రారంభించారని గుర్తు చేశారు. మూడోసారి హ్యాట్రిక్ దిశగా దూసుకుపోతూ తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రభంజనం సృష్టించబోతుందన్నారు. బహిరంగ సభ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తవుతున్నాయని మహిళలకు, వికలాంగులకు ప్రత్యేకమైన గాలరీలు ఏర్పాటు చేశామని, సభలో ఎవరికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అన్ని వర్గాల ప్రజలు అధిక సంఖ్యలో హాజరై ప్రజా ఆశీర్వాద సభను విజయవంతం చేయాలని కోరారు.

 

Related Posts

Video Viral : రియల్ ఎస్టేట్ బ్రోకర్ చెంప పగులగొట్టిన ఈటల

పేదల భూములను ఆక్రమించిన ఓ రియల్ ఎస్టేట్ బ్రోకర్ పై మల్కాజిగిరి ఎంపీ (Malkajgiri MP) ఈటల రాజేందర్ తీవ్రంగా ఫైర్ అయ్యారు. సంయమనం కోల్పోయిన ఆయన ఒక్కసారిగా బ్రోకర్ చెంప చెల్లుమనిపించారు. వెంటనే ఆయన వెంట వచ్చిన బీజేపీ నేతలు,…

కోల్​కతా ట్రైనీ డాక్టర్​ కేసు.. డెడ్ బాడీపై మహిళ డీఎన్ఏ

దేశవ్యాప్తంగా సంచలనం రేపిన కోల్ కతా ఆర్జీకర్ ఆస్పత్రి ట్రైనీ డాక్టర్ పై (Kolkata Doctor Murder Case) హత్యచారం కేసులో దోషి సంజయ్‌ రాయ్‌కి (Sanjay Roy) న్యాయస్థానం జీవిత ఖైదు విధించిన విషయం తెలిసిందే.  అయితే విచారణలో భాగంగా…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *