Mana Enadu:సన్నని చిరుజల్లులు కురుస్తుండగా.. పచ్చదనమంతా పచ్చని తోరణంలా పరుచుకున్న ప్రకృతిలో.. ఎత్తైన కొండల మధ్య.. ఏ బస్సు కిటికీ పక్కన సీట్లోనో.. లేక రైల్లో విండ్ సీట్ లోనో కూర్చొని ఊటీలో విహరిస్తే ఉంటుంది.. ఆహ్.. ఊహించడానికే అద్భుతంగా ఉంది కదూ. మరి ఈ అద్భుతాన్ని ఆస్వాదించాలంటే ఈ వర్షాకాలంలో హాయిగా ఊటీలో సేదతీరాల్సిందే. మీలాంటి వారి కోసమే తక్కువ ధరలో ఊటీ అందాలు చుట్టేసి వచ్చేందుకు ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) ఓ బ్రహ్మాండమైన ప్యాకేజీని ప్యాకేజీని అందిస్తోంది. ఈ ప్యాకేజీ ఎన్ని రోజులు? ఏయే ప్రదేశాలు చూడొచ్చు? ధర ఎంత? వివరాలు తెలుసుకుందామా..?
ప్యాకేజ్ వివరాలు ఇవే..
“అల్టిమేట్ ఊటీ ఎక్స్ హైదరాబాద్” పేరిట ఐఆర్సీటీసీ ఈ టూర్ ప్యాకేజీని అందిస్తోంది.
ప్రతి మంగళవారం హైదరాబాద్ నుంచి ట్రైన్ ద్వారా జర్నీ ఉంటుంది. ఈ టూర్ మొత్తం 5 రాత్రులు, 6 పగళ్లు కొనసాగుతుంది.
DAY- 1 : తొలిరోజు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి మధ్యాహ్నం 12.20 గంటలకు శబరి ఎక్స్ప్రెస్ (రైలు నం.17230) ఉంటుంది.
DAY- 2 : మరుసటి రోజు ఉదయం 8 గంటలకు కోయంబత్తూరు రైల్వే స్టేషన్ చేరుకున్న తర్వాత.. అక్కడ నుంచి ఊటీకి ఐఆర్సీటీసీ సిబ్బంది తీసుకెళ్తి ముందుగా బుక్ చేసుకున్న హోటల్లో చెకిన్ అవ్వాలి.
సాయంత్రం బొటానికల్ గార్డెన్స్, ఊటీ లేక్ అందాలు చూడొచ్చు.
DAY- 3 : మూడో రోజు ఉదయం హోటల్లోనే బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత దొడబెట్ట పీక్, టీ ఫ్యాక్టరీ, పైకారా వాటర్ ఫాల్ సందర్శించొద్దు.
DAY- 4 : నాలుగో రోజు ఉదయం బ్రేక్ఫాస్ట్ చేసి కూనూర్ పర్యటనకు వెళ్తారు. అక్కడి టీ ఎస్టేట్స్ చూసి తిరిగి సాయంత్రం ఊటీకి చేరుకుంటారు.
DAY- 5 : ఐదో రోజు ఉదయం హోటల్లో బ్రేక్ఫాస్ట్ చేశాక ఊటీ నుంచి కోయంబత్తూర్ వెళ్లి కోయంబత్తూర్ రైల్వే స్టేషన్ నుంచి సాయంత్రం 03:55 గంటలకు శబరి ఎక్స్ప్రెస్ (ట్రైన్ నెం:17229) హైదరాబాద్కు బయల్దేరుతుంది.
DAY- 6 :ఆరో రోజు మధ్యాహ్నం 12:30 గంటలకు సికింద్రాబాద్ చేరుకోవడంతో టూర్ సమాప్తమవుతుంది.
ఇక ప్యాకేజీ ధరలు ఎలా ఉన్నాయంటే..
థర్డ్ ఏసీ బెర్త్ లో ఒక్కో ప్రయాణికుడికి.. సింగిల్ షేరింగ్కు రూ.28,940, టూ షేరింగ్కు రూ.16,430, ట్రిపుల్ షేరింగ్కు రూ.13,380 చెల్లించాల్సి ఉంటుంది. ఇక 5 – 11 ఏళ్ల మధ్య చిన్నారులకు విత్ బెడ్కు రూ.9,100, విత్ అవుట్ బెడ్ అయితే రూ.8,850.
స్లీపర్ బెర్త్ సింగిల్ షేరింగ్కు రూ.26,480, ట్విన్ షేరింగ్కు రూ.13,980, ట్రిపుల్ షేరింగ్కు రూ.10,930. 5-11 ఏళ్ల మధ్య చిన్నారులకు విత్ బెడ్తో రూ.6,640, అదే విత్ అవుట్ బెడ్ అయితే రూ.6,400 చెల్లించాలి.
ప్రస్తుతం ఈ టూర్ సెప్టెంబర్ 24వరకు అందుబాటులో ఉంది.